BigTV English

SC pulls up center over delay: కేంద్ర ప్రభుత్వానికి భారీ హెచ్చరిక.. నవంబర్ 14 లోగా..

SC pulls up center over delay: కేంద్ర ప్రభుత్వానికి భారీ హెచ్చరిక.. నవంబర్ 14 లోగా..

SC Pulls up Centre: పెన్షన్ చెల్లింపు విషయంలో ఆలస్యం చేసిన కేంద్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. భారీగా జరిమానా విధించింది. భారత సైన్యంలో రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్ కు సంబంధించి కేంద్రం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ప్రకారం పెన్షన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నది. ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందంటూ న్యాయస్థానం మండిపడింది. ఈ క్రమంలో కేంద్రానికి రూ. 2 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పు వెల్లడించింది.


Also Read: పార్టీ వద్దని వారించినా.. మళ్లీ అదే వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం

అంతేకాదు.. ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమంటూ పేర్కొన్నది. నవంబర్ 14 లోగా సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. లేదంటే పెన్షన్ పెంపు విషయమై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందంటూ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.


Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×