E-Paper
Advertisement

Jammu Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు జవాన్లు మృతి..

Jammu Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు జవాన్లు మృతి..
Advertisement

Army vehicle attacked by terrorists in Kathua: జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో  ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు మృతి చెందగా.. ఆరుగురికి గాయీలయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారలు వెల్లడించారు. దాడి జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్, కార్డన్ ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు.

కశ్మీర్‌లో గత కొన్ని వారాలుగా ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. జూన్ 11, 12 తేదీల్లో దోడా జిల్లా జంట ఉగ్రదాడులతో దద్దరిల్లింది. అంతేకాకుండా జూన్ 11న, చత్తర్‌గల్లా వద్ద జాయింట్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇక జూన్ 12న గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక పోలీస్ సిబ్బంది గాయపడ్డారు.

Advertisement

దాడుల తరువాత, భద్రతా బలగాలు తమ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. జిల్లాలో చొరబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు అధికారులు.

Also Read: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం..

Advertisement

ఇదిలావుండగా, దక్షిణ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను ముట్టుబెట్టడంతో హిజ్బుల్-ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆర్‌ఆర్ కమాండర్ బ్రిగేడియర్ పృథ్వీరాజ్ చౌహాన్ సోమవారం ప్రకటించారు. ఈ ఆపరేషన్లలో, ఒక ఆర్మీ సిబ్బంది తన ప్రాణాలను త్యాగం చేశారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×