E-Paper
Advertisement

Arvind Kejriwal gets bail: సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

Arvind Kejriwal gets bail: సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..
Advertisement

Arvind Kejriwal gets bail: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎట్టకేలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. ఆయనకు సుప్రీంకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితులు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారడంతో కొందరు విడుదలయ్యారు. కీలక నిందితులుగా భావిస్తున్నమాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్యే కవితకు బెయిల్ వచ్చింది.

Advertisement

తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంతైంది. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. దాదాపు ఆరునెలల తర్వాత ఈ కేసులో తీహార్ జైలు నుంచి ఆయన బయటకు రానున్నారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఖరారు చేయడానికి సీఎం కేజ్రీవాల్ సర్కార్ 100 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ప్రధాని ఆరోపణ. ఆ నిధులను గోవా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రంగంలోకి దిగన ఈడీ, మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.

Advertisement

ALSO READ:  భారత నిబంధనలు పాటించని అమెజాన్, వాల్ మార్ట్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున ప్రచారం చేసుకునేందుకు ఆయనకు పలు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు. పోలింగ్ అనంతరం న్యాయస్థానం ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకి తరలించారు. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జులై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన తీహార్ జైలులో ఉండిపోయారు.

లిక్కర్ కేసులో జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. తనను అరెస్ట్ చేయడాన్ని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్లారు. బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం ససేమిరా అంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారాయన. దీనిపై ఇరుపక్షాల వాదలను విన్న ఇద్దరు సభ్యుల ధర్మాసనం, సెప్టెంబర్ ఐదున తీర్పు రిజర్వ్ చేసింది.  శుక్రవారం తీర్పు ఇచ్చింది న్యాయస్థానం.  10 లక్షల పూచీకత్తుపై  బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దని తీర్పులో ప్రస్తావించింది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×