BigTV English

Ayodhya Ram Mandir: రాములోరా మజాకా..! తాజ్ మహల్ రికార్డులను బద్దలు కొట్టిన అయోధ్య రామమందిరం

Ayodhya Ram Mandir: రాములోరా మజాకా..! తాజ్ మహల్ రికార్డులను బద్దలు కొట్టిన అయోధ్య రామమందిరం
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియా లోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్‌మహల్ పర్యాటక రంగంలో అగ్రగామిగా ఉండేదని.. ఇప్పుడు ఆ రికార్డును అయోధ్య బద్దలుకొట్టిందని ప్రకటించింది. అయోధ్యకు రికార్డు స్థాయిలో సందర్శకులు వచ్చారని.. తాజ్ మహల్‌ రికార్డ్‌ను అధిగమించిందని యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్ లోని పలు పర్యాటక కేంద్రాలను జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సుమారు 47.61 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారని అధికారులు వెల్లడించారు. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ మధ్య అయోధ్యను 13.55 కోట్ల మంది దేశీయ పర్యాటకులు.. 3,153 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని పర్యాటక శాఖ వెల్లడించింది. అదే సమయంలో తాజ్‌మహల్‌ను 12.51 కోట్ల మంది సందర్శించినట్టు తెలిపింది. వారిలో 11.59 మంది దేశీయ పర్యాటకులు.. 9.24 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో ఆగ్రా కంటే అయోధ్యనే ఎక్కువ మంది సందర్శించారని పర్యటన శాఖ పేర్కొంది. అయోధ్య కేవలం 9 నెలల్లో తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించినట్లుగా తెలిపింది.


మొత్తంగా గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తే.. ఈ ఏడాది కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్లు పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా తాజ్ మహల్ పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. దేశీయ టూరిస్టుల సంఖ్య కాస్త తగ్గినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Also Read: చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్.. సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన ఆర్థిక శాఖ


ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×