E-Paper
Advertisement

BiporJoy: బిపోర్‌జాయ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్.. గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపు..

BiporJoy: బిపోర్‌జాయ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్.. గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపు..
Advertisement
biporjoy

BiporJoy cyclone news latest(Telugu breaking news today): గుజరాత్‌ రాష్ట్రంపై బిపోర్‌జాయ్ తుపాను పంజా విసురుతోంది. ఈదురుగాలుల దెబ్బకు భారీ సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరడగడంతో దాదాపు వెయ్యికి పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 రోజుల పాటు అరేబియా సముద్రంలో కొనసాగిన బిపోర్‌జాయ్.. గురువారం సాయంత్రం గుజరాత్‌లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 125 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీచాయి. అనంతరం కొన్ని గంటల తర్వాత బలహీన పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

బిపోర్‌జాయ్ తుపాను గుజరాత్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. గుజరాత్ వ్యాప్తంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వృక్షాలు వేళ్లతో సహా నేలకు ఒరిగాయి. చాలా వాహనాలు, ఇళ్లు వర్షం, భీకర గాలుల ధాటికి ధ్వంసమయ్యాయి. శుక్రవారం రాత్రి వరకు బిపోర్‌జాయ్ తుపాను బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారనుందని.. వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

బిపోర్‌జాయ్ తుపాను ప్రస్తుతం గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపు కదులుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తుపాను ప్రభావంతో రెండు రోజుల పాటు రాజస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. భారీ గాలులు, కుంభ వృష్టి ధాటికి తాత్కాలిక ఇళ్లు, భారీ వృక్షాలు కూలిపోవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

బిపోర్‌జాయ్ తుపాను విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. తుపాను తీరం దాటిన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించారు. గిర్ అడవుల్లోని క్రూర మృగాలు, సింహాల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల గురించి గుజరాత్ సీఎంను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.

Advertisement

కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని చోట్ల నడుము లోతు నీళ్లు వచ్చి చేరాయి. NDRf, SDRf బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 631 మెడికల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు. గుజరాత్ లోని 8 తీరప్రాంత జిల్లాల్లోని హాస్పిటల్స్ లో 4 వేల దాకా క్రిటికల్ కేర్ బెడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 1148 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో 680 మంది గర్భిణులకు సేఫ్ గా డెలివరీ చేశారు డాక్టర్లు.

బిపోర్‌జాయ్ తుపాను నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం వారంతా ఆ శిబిరాల్లోనే ఉంటున్నారు. ఈ బిపోర్‌జాయ్ తుపాను కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 99 రైళ్లు ఆలస్యంగా లేదా రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లడంపై శనివారం వరకు నిషేధం విధించారు. గుజరాత్ జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో కమర్షియల్ ఆపరేషన్స్‌ను నిలిపివేశారు. శనివారం నుంచి యథావిధిగా విమాన సర్వీసులు నడుస్తాయని అధికారులు తెలిపారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×