BigTV English
Advertisement

Arvind Kejriwal’s Sheesh Mahal: మాజీ సీఎం కేజ్రీవాల్ బంగ్లా.. బీజేపీ బయటపెట్టిన శీష్‌మహల్ వీడియో

Arvind Kejriwal’s Sheesh Mahal: మాజీ సీఎం కేజ్రీవాల్ బంగ్లా.. బీజేపీ బయటపెట్టిన శీష్‌మహల్ వీడియో

Arvind Kejriwal’s Sheesh Mahal: ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ఏఏపీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోస్తూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేజ్రీవాల్ కొత్త ఇంటి భవనం డీటేల్స్ బయటపెట్టింది బీజేపీ.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. వచ్చే ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో అధికార ఆప్-బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరి తారాస్థాయికి చేరింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కంచుకోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు సంధిస్తున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అరవింద్ కేజ్రీవాల్. అధికార నివాసాన్ని ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్లిపోయారు. మాజీ సీఎం బంగ్లా గురించి కొత్త విషయాలు బయటపెట్టింది బీజేపీ. ఇంద్రభవనాన్ని తలపించేలా ముఖ్యమంత్రి బంగ్లాను నిర్మించారు అరవింద్ కేజ్రీవాల్! కేజ్రీవాల్‌ బంగ్లా లక్ష్యంగా బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. అంతేకాదు ఈ బంగ్లాకు సంబంధించి ‘శీష్ మహల్’ పేరిట వీడియో విడుదల చేసింది.


7 స్టార్ రిసార్టును తలపించేలా భవనాన్ని నిర్మించారన్నది బీజేపీ వాదన. సామాన్యుడిని అని చెబుతూ రాజ భవనాలు ఎందుకని గతంలో ప్రశ్నించారు కమలనాథులు. ఢిల్లీని లూటీ చేసి మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన నల్ల ధనంతో ‘శీష్ మహల్’ కట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఆరోపించారు.

ALSO READ:  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఇక లేరు

అరవింద్ కేజ్రీవాల్ విలాసవంతమైన బంగ్లాలో ఉంటున్నారని ఆరోపించింది బీజేపీ. ఇరాక్‌కు చెందిన సద్దాం హుస్సేన్, నార్త్‌ కొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ భవనాల మాదిరిగా ఆ బంగ్లా ఉందన్నారు. రాజకీయాలతో కెరీర్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్, అధికారిక నివాసాన్ని పునరుద్ధరించడానికి 45 కోట్లు ఖర్చు చేశారంటూ విమర్శలు ఎక్కుపెట్టింది.

తెల్లని స్తంభాలు, పాలరాతి అంతస్తులతో కూడిన బంగ్లాలో మార్బల్ ఫ్లోర్, ఫాన్సీ లైటింగ్, ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయని పేర్కొంది. బీజేపీ బయటపెట్టిన వీడియోపై ఇంకా ఆప్ నేతలు రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియాలో ఆప్ మద్దతుదారులు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ప్రధాని మోదీ డ్రెస్సులు, వాహనాలు, విమానం, కొత్త హౌస్ కోసం 500 కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపణలు జోరందుకున్నాయి.

ఇదే సమయంలో గతంలో కేజ్రీవాల్ చేసిన ట్వీట్స్ బయటపెట్టింది బీజేపీ. చాలా మంది ప్రజలు మురికివాడల్లో ఉంటున్నారని, అలాంటిది ఆమె ఇంట్లో 10 ఏసీలు ఉన్నాయని ఆరోపిస్తూ అప్పటి ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌ను లక్ష్యంగా చేసుకుని 2013లో కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ బయటపెట్టింది బీజేపీ. మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆప్-బీజేపీ మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×