Blast in Tamilnadu Virudhunagar Quarry : తమిళనాడులో భారీ బాంబు పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీపంలోని అవియూర్ లోని క్వారీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
పేలుడు ధాటికి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. క్వారీలో పేలుడు ఘటనతో కారియాపట్టి హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ క్వారీపై స్థానికులు కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోవడం లేదు. క్వారీ నిర్వహించేవారు కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని వాపోతున్నారు. పేలుడు ఘటనకు కొద్దినెలల క్రితమే క్వారీని తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. మళ్లీ క్వారీలో పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.