E-Paper
Advertisement

Blast in Tamilnadu : క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Blast in Tamilnadu : క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Blast in Tamilnadu Virudhunagar Quarry : తమిళనాడులో భారీ బాంబు పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీపంలోని అవియూర్ లోని క్వారీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

పేలుడు ధాటికి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. క్వారీలో పేలుడు ఘటనతో కారియాపట్టి హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ క్వారీపై స్థానికులు కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోవడం లేదు. క్వారీ నిర్వహించేవారు కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని వాపోతున్నారు. పేలుడు ఘటనకు కొద్దినెలల క్రితమే క్వారీని తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. మళ్లీ క్వారీలో పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×