Tarun Tejpal: బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో దోషిగా ప్రకటించింది. గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం అనుమతించింది. 2021లో మాపుసా సెషన్స్ కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తీర్పునే హైకోర్టు రద్దు చేసింది.
2013 నవంబర్లో తన జూనియర్ మహిళా జర్నలిస్టును గోవాలోని ఫైవ్స్టార్ హోటల్ లిఫ్ట్లో లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో మ్యాగజైన్ వార్షిక సదస్సు జరుగుతోంది. బాధితురాలి ఫిర్యాదు తర్వాత 2013 నవంబర్ 30న తేజ్పాల్ను అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల నేరాలను హైకోర్టు నిర్ధారించింది. పదేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది. రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, 62 ఏళ్ల తన వయసును దృష్టిలో ఉంచుకొని దయ చూపాలని తేజ్పాల్ అభ్యర్థించారు.
Also Read: వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్లో యువకులు అఘాయిత్యం
తాను రాజకీయ బాధితుడినని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా తీర్పుపై 8 వారాల స్టే ఇవ్వాలని కూడా ఆయన విన్నవించారు. కానీ బాంబే హైకోర్టు అవేవీ పరిగణనలోకి తీసుకోలేదు. పదేళ్ల జైలు శిక్ష పడిన తరుణ్ తేజ్పాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారా? జైలుకు వెళ్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఈ కేసు నెక్ట్స్ ఎలాంటి టర్న్ తీసుకోబోతోందనే దానికోసం కాస్త వెయిట్ చేయాల్సిందే!
Also Read: దమ్ముంటే ఆడియోలు బయట పెట్టండి.. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!