Rajahmundry Doctor: మద్యం మత్తు క్షణికావేశం ఈ దుర్మార్గులు చేసిన యాక్సిడెంట్ ని ఇంత చిన్న చిన్న పదాలతో తేల్చి చెప్పడానికి మనసొప్పడం లేదు. కారణం వీరి నిర్వాకం కాస్తా ఒక నిండు ప్రాణాన్ని చావు బతుకుల మధ్యకు నెట్టేసింది. ఈ ఘటన జరిగింది రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర. మందుకొట్టిన మత్తోన్మాదుల వల్ల బలై పోయిందో ఫ్యూచర్ డాక్టర్. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ యువతి తలపై నుంచి తమ వెహికల్ ఎక్కించారా మద్యం మత్తుగాళ్లు. దీంతో షాకై పోయారు ప్రత్యక్ష సాక్షులు.
నామవరానికి చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్స్ దస్వంత్, జోసఫ్.. విపరీతంగా మందు కొట్టి.. మాల్ లోకి వచ్చారు. అక్కడ కూడా మత్తులో ఇష్టారాజ్యం చేశారు. అప్పటికీ మాల్ సెక్యూరిటీ వీరిని బయటకు పంపేందుకు ట్రై చేశారు. గేటు దాటేటప్పుడు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గాళ్లు.. సెక్యూరిటీతో గొడవ గొడవ చేశారు.
Also Read: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై పోక్సో కేసు నమోదు!
సెక్యూరిటీపై ఉన్న కోపంతో రగిలిపోయిన ఈ ఉన్మాదులు కారును జెట్ స్పీడ్ తో పోనిచ్చారు. సరిగ్గా అదే టైంలో గేటు ముందు నుంచి వెళ్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టారు. స్కూటీ వెనక కూర్చున్న మెడికల్ స్టూడెంట్ కి గట్టిగా దెబ్బలు తాకాయి. ఆమె కింద పడిపోయింది. దీంతో అడ్డుకున్న సెక్యూరీటిని డామినేట్ చేస్తూ దూసుకోళ్లడంలో భాగంగా ఆమె తలపై నుంచి కారు తొక్కిస్తూ రాక్షసంగా ముందుకెళ్లారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ మెడికోను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో బ్రెయిన్ డెడ్ గా నిర్దారించారు డాక్టర్లు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని హైదరాబాద్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు మందుబాబులిద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
Also Read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. స్పందించిన టీమ్!
మెడికల్ విద్యార్థినిపై కారు ఎక్కించిన యువకులు
AP: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డు మాల్ వద్ద పార్కింగ్ వివాదంలో ప్రియాంక అనే మెడికల్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారు ఎక్కించారు. ఈ ప్రమాదంలో కారు తలపై నుంచి వెళ్లడంతో ప్రియాంక బ్రెయిన్ డెడ్గా మారింది. ఈ… pic.twitter.com/zXP5ZdsVOf
— BigTV APP (@BigtvApp) August 6, 2026
Also Read: రష్యాను వణికిస్తున్న రాక్షస మిడతల దండు.. భారీ ప్రమాదం అంచులో ఆసియా దేశాలు