BigTV English

BIG BREAKING: కుప్పకూలిన వంతెన.. ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు

BIG BREAKING: కుప్పకూలిన వంతెన.. ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు

BIG BREAKING: మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కుండ్మాల సమీపంలో ఇంద్రాయణి నదిపై ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు మృతిచెందగా.. 25 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ALSO READ: Snake News: వర్షాకాలం జాగ్రత్త.. మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే పాములకు వణుకు పుట్టాల్సిందే!

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూణె జిల్లాలోని ఇంద్రాయణి నదిపై కుందుమాలా పర్యాటక ప్రాంతం ఫేమస్. ఈ రోజు ఆదివారం కావడంతో.. పర్యాటకులు కుందుమలాకు పోటెత్తారు. అయితే అక్కడనున్న ఇనుప వెంతెనపై చాలా మంత్రి నిలబడ్డారు. దీంతో వెయిట్ ఎక్కువ కావడంతో వంతెన కొంత భాగం కూలిపోయింది. దీంతో చాలా మంది నదిలో కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. స్థానిక పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. కొంతమందిని రక్షించినప్పటికీ పలువురి జాడ ఇంకా తెలియరాలేదు.


ఇంద్రాయణి రివర్ పై 30 ఏళ్ల క్రితం ఇనుప వంతెనను నిర్మించినట్టు స్థానిక ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై కాలినడక మార్గం కూడా ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై దాదాపు వంద మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో అనేక మంది ఒడ్డుకు చేరుకున్నప్పటికీ పలువురు గల్లంతయ్యారు. అయితే గత రెండు రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. పూణేతో పాటు, పింప్రి, చించ్వాడ్, తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. భారత్ వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది.

రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వర్షాలు భారీగా పడుతున్న క్రమంలో కొన్ని రోజుల పాటు పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడమే మంచిదంటున్నారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×