E-Paper
Advertisement

Farmers Died : తీవ్ర నష్టం.. తీరని విషాదాన్ని మిగిల్చిన భారీ వర్షం

Farmers Died : తీవ్ర నష్టం.. తీరని విషాదాన్ని మిగిల్చిన భారీ వర్షం

Farmers Died in Telangana(Local news telangana): తీవ్ర ఎండల నుంచి భారీ వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది కానీ.. రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగించింది. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పలుచోట్ల పిడుగులు పడి రైతులు కన్నుమూశారు. పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు, గాలి వానకు గోడకూలి మరో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో, మెదక్ జిల్లా మాసాయిపేటలోనూ మార్కెట్ యార్డులు, కల్లాల వద్ద ఆరబోసిన వరిధాన్యం భారీ వర్షానికి తడిచిపోయింది. పలుప్రాంతాల్లో ధాన్యం.. వర్షపునీటిలో కొట్టుకుపోయింది. వర్షానికి తడిచి, చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

Also Read : బాచుపల్లిలో తీవ్ర విషాదం.. గోడ కూలి ఏడుగురు దుర్మరణం, సీఎం దిగ్భ్రాంతి

సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులకు మామిడి తోటలు నేలకొరిగాయి. భారీవృక్షాలు సైతం విరిగిపడ్డాయి. గాలివానకి మెదక్ జిల్లా కౌడిపల్లి (మం) రాయిలపూర్ నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అలాగే.. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో బావి వద్దకు వెళ్తుండగా పిడుగుపడి మల్లేశం(33) అనే రైతు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామ శివారులో పిడుగుపడి మరో రైతు మృతి చెందారు.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×