BigTV English

Farmers Died : తీవ్ర నష్టం.. తీరని విషాదాన్ని మిగిల్చిన భారీ వర్షం

Farmers Died : తీవ్ర నష్టం.. తీరని విషాదాన్ని మిగిల్చిన భారీ వర్షం

Farmers Died in Telangana(Local news telangana): తీవ్ర ఎండల నుంచి భారీ వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది కానీ.. రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగించింది. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పలుచోట్ల పిడుగులు పడి రైతులు కన్నుమూశారు. పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు, గాలి వానకు గోడకూలి మరో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.


సంగారెడ్డి జిల్లా జోగిపేటలో, మెదక్ జిల్లా మాసాయిపేటలోనూ మార్కెట్ యార్డులు, కల్లాల వద్ద ఆరబోసిన వరిధాన్యం భారీ వర్షానికి తడిచిపోయింది. పలుప్రాంతాల్లో ధాన్యం.. వర్షపునీటిలో కొట్టుకుపోయింది. వర్షానికి తడిచి, చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

Also Read : బాచుపల్లిలో తీవ్ర విషాదం.. గోడ కూలి ఏడుగురు దుర్మరణం, సీఎం దిగ్భ్రాంతి


సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులకు మామిడి తోటలు నేలకొరిగాయి. భారీవృక్షాలు సైతం విరిగిపడ్డాయి. గాలివానకి మెదక్ జిల్లా కౌడిపల్లి (మం) రాయిలపూర్ నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అలాగే.. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో బావి వద్దకు వెళ్తుండగా పిడుగుపడి మల్లేశం(33) అనే రైతు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామ శివారులో పిడుగుపడి మరో రైతు మృతి చెందారు.

Related News

KTR: తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల భారం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నార్శింగ్-హిమాయత్‌‌సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్..

Weather News: మరో రెండు రోజుల భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, బయటకు వెళ్తే అంతే సంగతులు

BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

Hyderabad Musi River: మూసీ నదికి పోటెత్తిన వరద.. మునిగిన హైదరాబాద్.. హై అలర్ట్!

BRS KTR: నన్ను ఇప్పుడంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి.. నేను దేనికైనా రెడీ: కేటీఆర్

ED raids Hyderabad: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. బసరత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు

TG Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలకు దసరా సెలవులు, ఎప్పటినుంచంటే?

Big Stories

×