BigTV English
Advertisement

Bus falls down from a mountain at Shimla: సిమ్లాలో ఘోరం ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, నలుగురు మృతి

Bus falls down from a mountain at Shimla:  సిమ్లాలో ఘోరం ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, నలుగురు మృతి

Bus falls down from a mountain at Shimla: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు స్పాట్‌లో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అసలు ఎలా జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..


హిమాచల్‌ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సు సిమ్లాలో కుద్దు నుంచి దిల్తారీకి వెళ్తోంది. అయితే ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో బస్సు జుబ్బల్‌లోని కెంచి ప్రాంతానికి రాగానే అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్, ఓ మహిళ, నేపాలీ జాతీయుడు మృతి చెందినట్టు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


ALSO READ: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..

గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితుల వద్దకు వెళ్లి ప్రమాదానికి దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు.

 

 

Tags

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Big Stories

×