EPAPER

Bus falls down from a mountain at Shimla: సిమ్లాలో ఘోరం ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, నలుగురు మృతి

Bus falls down from a mountain at Shimla:  సిమ్లాలో ఘోరం ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, నలుగురు మృతి

Bus falls down from a mountain at Shimla: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు స్పాట్‌లో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అసలు ఎలా జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..


హిమాచల్‌ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సు సిమ్లాలో కుద్దు నుంచి దిల్తారీకి వెళ్తోంది. అయితే ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో బస్సు జుబ్బల్‌లోని కెంచి ప్రాంతానికి రాగానే అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్, ఓ మహిళ, నేపాలీ జాతీయుడు మృతి చెందినట్టు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


ALSO READ: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..

గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితుల వద్దకు వెళ్లి ప్రమాదానికి దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు.

 

 

Tags

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Ajit Pawar : మహా ఎన్నికల్లో కీలక పరిణామం, అజిత్‌ పవార్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్, ఇక ఆ గుర్తు మీదే !

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Big Stories

×