E-Paper
Advertisement

Bus falls down from a mountain at Shimla: సిమ్లాలో ఘోరం ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, నలుగురు మృతి

Bus falls down from a mountain at Shimla:  సిమ్లాలో ఘోరం ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, నలుగురు మృతి

Bus falls down from a mountain at Shimla: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు స్పాట్‌లో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అసలు ఎలా జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..

హిమాచల్‌ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సు సిమ్లాలో కుద్దు నుంచి దిల్తారీకి వెళ్తోంది. అయితే ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో బస్సు జుబ్బల్‌లోని కెంచి ప్రాంతానికి రాగానే అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్, ఓ మహిళ, నేపాలీ జాతీయుడు మృతి చెందినట్టు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..

గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితుల వద్దకు వెళ్లి ప్రమాదానికి దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు.

 

 

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×