E-Paper
Advertisement

CTET Notification 2024: సీటెట్ నోటిఫికేషన్.. పరీక్ష తేదీ, దరఖాస్తుల వివరాలు ఇవీ..!

CTET Notification 2024: సీటెట్ నోటిఫికేషన్.. పరీక్ష తేదీ, దరఖాస్తుల వివరాలు ఇవీ..!
Advertisement

CTET Notification 2024 latest news

CTET Notification 2024 Latest News: సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష CTET కు నోటిఫికేషన్ విడుదలైంది. 19వ ఎడిషన్ సీటెట్ పరీక్షను ఈ ఏడాది జూలై 7న నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 136 నగరాలలో 20 లాంగ్వేజీల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు మార్చి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 2 రాత్రి 11.59 గంటల వరకూ ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Advertisement

ప్రతి ఏటా రెండుసార్లు సీటెట్ పరీక్షను నిర్వహిస్తారు. 19వ ఎడిషన్ సీటెట్ కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు పేపర్ కు రూ.1000, 2 పేపర్లకు రూ.1200 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే పేపర్ కు రూ.500, 2 పేపర్లకు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

సీటెట్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన స్కోరును.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ సాధించిన స్కోర్ కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. రెండు పేపర్లుగా నిర్వహించే పరీక్షలో.. మొదటి పేపర్ 1-5 తరగతులకు, రెండో పేపర్ 6-9 తరగతులకు పాఠాలు చెప్పాలనుకునేవారు రాయవచ్చు.

Advertisement

పేపర్ -2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, పేపర్ -1 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సీటెట్ పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు మరింత సమాచారానికై https://cdnbbsr.s3waas.gov.in/s3443dec3062d0286986e21dc0631734c9/uploads/2024/03/2024030749.pdf ఈ లింక్ ను క్లిక్ చేయండి.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×