BigTV English

PM Narendra Modi: ‘ఇదేం అన్యాయం’.. పీఎం మోదీకి కాంగ్రెస్ ఎంపీల లేఖ

PM Narendra Modi: ‘ఇదేం అన్యాయం’.. పీఎం మోదీకి కాంగ్రెస్ ఎంపీల లేఖ

Congress MP: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బీజేపీ మినహా తెలంగాణలోని అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం కూడా చేసింది. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేసింది. కాగా కొందరు కేంద్రమంత్రులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తెలంగాణకు కూడా నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నేరుగా ప్రధానమంత్రికి ఓ లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆ లేఖలో వారు డిమాండ్ చేశారు.


ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకురావాలని భావించినట్టు వారు లేఖలో పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ఆధారంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. ఈ పునర్విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చిందని తెలిపారు. ఆ ఆ హామీలనూ ఏకరువు పెట్టారు. అవి.. ఐటీఐఆర్, ఐఐఎం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తెలంగాణలోని పది జిల్లాల్లో 9 జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.

Also Read: అవసరమా బ్రో ఇలాంటి స్టంట్స్.. ప్రాణాలు పోతే ఎవరిది భాద్యత..


అయితే, ఏపీ పునర్విభజన చట్టం కింద చేసిన హామీలు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా అమల్లోకి వచ్చాయని ఈ సందర్భంగా ఎంపీలు పేర్కొన్నారు. తమ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు చాలా సార్లు ప్రధానమంత్ర, ఆర్థిక శాఖ మంత్రి, ఇతర సంబంధిత కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పలుమార్లు విజ్ఞప్తులు చేశారని వివరించారు. ఇన్ని చేసినా తెలంగాణ రాష్ట్రానికి తాజా కేంద్ర బడ్జెట్‌లో ఏమీ కేటాయించలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చేసినట్టే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని వివరించారు. ఏపీకి ఇచ్చిన హామీలను పూర్తి చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని స్పష్టత ఇచ్చారు.

కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి లెటర్ హెడ్ పై రాసిన ఈ లేఖపై కాంగ్రెస్ ఎంపీలు అందరూ సంతకాలు పెట్టారు.

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×