E-Paper
Advertisement

Congress Party Review Meeting: హర్యానాలో ఓటమి.. కాంగ్రెస్ రివ్యూ మీటింగ్‌, అంతర్గత విభేదాలే కారణమా?

Congress Party Review Meeting: హర్యానాలో ఓటమి.. కాంగ్రెస్  రివ్యూ మీటింగ్‌, అంతర్గత విభేదాలే కారణమా?
Advertisement

Congress Party Review Meeting: హర్యానా ఎన్నికల్లో అసలేం జరిగింది? దశాబ్దంపాటు ఒకే పార్టీ అధికారంలో మళ్లీ ఎలా కంటిన్యూ చేయగలిగింది? ప్రజల అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయిందా? హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన భేటీలో ఈ విషయం బయట పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హర్యానా ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసింది. గురువారం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్‌మాకెన్‌తోపాటు హర్యానాకు చెందిన కొందరు నేతలు హాజరయ్యారు.

Advertisement

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి గల కారణాలను గుర్తించేందు కు నేతలు తమతమ అభిప్రాయాలను బయటపెట్టారు. చాలామంది నేతలు ఈవీఎంల వ్యవహారాన్ని తప్పుబట్టారు. ప్రాంతాల వారీగా సేకరించిన వివరాలను దగ్గర పెట్టి హర్యానా కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు అగ్రనేతలు.

ఓటమికి ప్రధాన కారణాల్లో తొలుత ముఠాతత్వం, రెండోది వ్యక్తి గత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కొందరి నేతలు ఓపెన్‌గా చెప్పారట. ఎవరి పట్టు కోసం వారు ప్రయత్నాలు చేశారని, దాన్ని ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకున్నారని తెలిపారు. బీజేపీ విజయానికి ఆప్ కొంత తోడైందని అంటున్నారు.

Advertisement

ALSO READ: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఈవీఎం వ్యత్యాసాల పరిశీలనకు కమిటీ!

అధికార పార్టీలో గ్రూపులు ఉన్నాయని వాళ్లు ఎలా అధిగమించారన్నది అసలు ప్రశ్న. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య రాలేదని, ఇక్కడే ఎందుకొచ్చిందని ఆ రాష్ట్రానికి చెందిన నేతలను అగ్రనేతలు ప్రశ్నించారట.

వీటిపై నిగ్గు తేల్చాలంటే నియోజకవర్గాల వారీగా ఎదురైన సమస్యలను తెలుసుకునేందుకు నిజ నిర్థారణ కమిటీని నియమించాలని నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. అందులో వెల్లడైన కారణాలతో కొందరి నేతలపై వేటు వేయడం ఖాయమనే ప్రచారం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కొందరు సీనియర్లు, ప్రతీ విషయాన్ని అగ్రనేతలు గమనిస్తున్నారని, తేడా వస్తే పక్కన పెట్టేయడం ఖాయమని అంటున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×