E-Paper
Advertisement

Kamal Nath: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ.. కమల్ నాథ్ కుమద్దతుగా ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలు..

Kamal Nath: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ.. కమల్ నాథ్ కుమద్దతుగా ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలు..
Advertisement

Madhya Pradesh Congress leader Kamal Nath: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఆదివారం కమల్‌నాథ్‌ వర్గం ఎమ్మెల్యేలు కొందరు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా పార్టీ అగ్రనాయకత్వం ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో.. ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. తమ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఆయనకు మద్దతు ఇస్తామని ఢిల్లీ బయల్దేరడానికి ముందు వీరంతా వ్యాఖ్యానించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు కమల్‌నాథ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడరని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడి ఆయన పార్టీ మారే వ్యక్తి కాదన్నారు. నిజమైన కాంగ్రెస్‌ నాయకుడన్నారు. కమల్ నాథ్ రాజకీయ ప్రయాణం మొదలైంది ఇక్కడేనని అన్నారు. పార్టీ ఆయనకు అన్ని రకాల పదవులు ఇచ్చిందన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆయన్ను మూడో కుమారుడిగా పేర్కొనేవారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్‌ను వీడుతున్నారనడం ఊహాగానాలే నని దిగ్విజయ్ సింగ్ కొట్టి పారేశారు.

Advertisement

గతేడాది చివర్లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 66 స్థానాలకు పరిమితమైంది. దీనికి కమల్‌నాథ్‌ కారణమని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. దీంతోపాటు ఆయన కుమారుడు నకుల్‌ నాథ్‌ లోక్‌సభ అభ్యర్థిత్వంపై స్పష్టత లేకపోవడంతో శనివారం తండ్రీకుమారులు పార్టీ మారనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఇద్దరు ఢిల్లీకి చేరుకున్నారు.

మరోవైపు పార్టీ మార్పు జరిగితే ముందుగా సమాచారం ఇస్తానని విలేకరులతో కమల్‌నాథ్‌ చెప్పడంతో ఆ వార్తకి మరింత బలం చేకూరింది. అయితే, కాంగ్రెస్‌ నాయకులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. మరోవైపు 66 మందిలో 23 మందిని తమతో తీసుకెళ్లేందుకు కమల్‌నాథ్‌ వర్గం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దానివల్ల పార్టీ ఫిరాంయిపుల చట్టం తమకు వర్తించదని భావిస్తున్నట్లు సమాచారం.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×