E-Paper
Advertisement

Corona: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Corona: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Advertisement

Corona: కరోనా పీడ విరగడయిందని ఊపిరి పీల్చుకుంటున్నారా..? లేదు కరోనా ఇంకా పోలేదు. మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. ఓ వైపు ఫ్లూ పంజా విసురుతుంటే.. మరోవైపు కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఆదివారం ఒక్కరోజే భారత్‌లో 1805 కేసులు నమోదు అయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేశంలో కరోనా తీవ్రత ఎంతలా ఉందో. థర్డ్ వేవ్ ముప్పు తొలగిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గడిచిన ఏడు రోజుల్లో కేసుల సంఖ్య 78 శాతం పెరిగింది. కొత్తగా ఈ మహమ్మారి బారిన పడి 29మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ గత ఏడు రోజుల్లో 1956 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 1579 కేసులు వెలుగు చూశాయి. కేరళ, కర్నాటక, ఢిల్లీ, తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కేసుల సంఖ్యను చూస్తే తెలుస్తోంది. దేశంలో మార్చి 19 నుంచి 25 మధ్య కొత్తగా 8,781 కేసులు నమోదయ్యాయి. గత ఆరు వారాల నుంచి దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ 5 వందలకు పైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి.

Advertisement

రోజురోజుకు కరోనా కేసులు డబుల్ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాగా ఏదైన ప్రమాదం ముంచుకొస్తుందా అనే భయాందోళనలు రేకెత్తుతున్నాయి. చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మ్యుటేషన్ల వల్లే కేసులు పెరుగుతున్నాయని.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పని సరి అని సూచిస్తున్నారు.

Related News

2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు

చిరుతను ఢీకొట్టిన కారు.. సాయం కోసం వచ్చిన అధికారిపై దాడి చేసిన క్రూరమృగం.. షాకింగ్ వీడియో!

పరీక్షల్లో 95.7 శాతం మార్కులు.. అయినా స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాళ్ల ఉద్యోగాలు ఔట్!

టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, అలాంటివారి నో ఛాన్స్

శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్

Big Stories

Advertisement
×