E-Paper
Advertisement

Corona: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Corona: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Advertisement

Corona: కరోనా పీడ విరగడయిందని ఊపిరి పీల్చుకుంటున్నారా..? లేదు కరోనా ఇంకా పోలేదు. మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. ఓ వైపు ఫ్లూ పంజా విసురుతుంటే.. మరోవైపు కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఆదివారం ఒక్కరోజే భారత్‌లో 1805 కేసులు నమోదు అయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేశంలో కరోనా తీవ్రత ఎంతలా ఉందో. థర్డ్ వేవ్ ముప్పు తొలగిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గడిచిన ఏడు రోజుల్లో కేసుల సంఖ్య 78 శాతం పెరిగింది. కొత్తగా ఈ మహమ్మారి బారిన పడి 29మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ గత ఏడు రోజుల్లో 1956 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 1579 కేసులు వెలుగు చూశాయి. కేరళ, కర్నాటక, ఢిల్లీ, తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కేసుల సంఖ్యను చూస్తే తెలుస్తోంది. దేశంలో మార్చి 19 నుంచి 25 మధ్య కొత్తగా 8,781 కేసులు నమోదయ్యాయి. గత ఆరు వారాల నుంచి దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ 5 వందలకు పైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి.

Advertisement

రోజురోజుకు కరోనా కేసులు డబుల్ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాగా ఏదైన ప్రమాదం ముంచుకొస్తుందా అనే భయాందోళనలు రేకెత్తుతున్నాయి. చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మ్యుటేషన్ల వల్లే కేసులు పెరుగుతున్నాయని.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పని సరి అని సూచిస్తున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×