E-Paper
Advertisement

Kolkata Murder Case : కోల్‌కత్తా వైద్య విద్యార్థిపై హత్య కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. ఏం తేల్చిందంటే

Kolkata Murder Case : కోల్‌కత్తా వైద్య విద్యార్థిపై హత్య కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. ఏం తేల్చిందంటే
Advertisement

Kolkata Murder Case : దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన కొల్ కత్తాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో కోర్టు తీర్పు వెలువడింది. ఈ ఘటనలో ప్రధాన ముద్దాయిగా ఉన్న సంజయ్ రాయ్ తప్పు చేసినట్లుగా బలమైన ఆధారాలు లభించడంతో అతనే నేరం చేసినట్లుగా కోర్టు నిర్థరించింది. దీంతో.. నిందితుడిని దోషిగా తేల్చుతూ సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతానికి అతను తప్పు చేసినట్లుగా తేల్చిన కోర్టు.. శిక్షను సోమవారం వెలువరించనుంది.

అభయ హత్యాచార కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్య విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ ని ఉరి తీయాలంటూ సిల్దా కోర్టు బయట ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోర్టు బయట పెద్ద సంఖ్యలో గుమ్మిగూడిన మెడిసిన్ విద్యార్థులు, ప్రజలు.. సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

నిందితుడు సంజయ్ కు విధించే శిక్షను చూసి ఇంకొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడేందుకు భయపడాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన సృష్టించిన కేసు కావడంతో పోలీసు యంత్రాంగం.. గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. కేసు తీవ్రత దృష్ట్యా భారీ బందోబస్తు మధ్య సంజయ్ రాయ్ ను కోర్టుకు తీసుకొచ్చారు. ప్రత్యేక బృందాలతో పాటు 300 మందికి పైగా పోలీసులు కోర్టు చుట్టూ మోహరించి, ఎలాంటి ఆందోళనలు, హింస చెలరేగకుండా చర్యలు చేపట్టారు.

ఈ కేసులో సీబీఐ బలమైన సాక్షాధారాలు సమర్పించడంతో కేసు నుంచి తప్పించుకోవడం నిందితుడి వల్ల కాలేదని పోలీసులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక వర్గాల నుంచి వ్యతిరేకత ఉండడం, కేసు దర్యాప్తులో మొదటి నుంచి పోలీసు యంత్రాంగం సీరియస్ గా తీసుకుందని పోలీసులు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×