E-Paper
Advertisement

Bomb Threat: ఢిల్లీలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్, 10 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు..

Bomb Threat: ఢిల్లీలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్, 10 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు..
Advertisement

Bomb Threat To Delhi Airport, Hospitals: సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టుతో సహా 10 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో బాంబు నిర్వీర్య స్క్వాడ్‌లు, ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజిన్లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.

ముందుగా బురారీ ఆసుపత్రికి మధ్యాహ్నం 3.15 గంటలకు బాంబు బెదిరింపు  వచ్చిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. అటు బురారీ ఆసుపత్రికి బాంబు బెదిరింపు రావడంతో స్థానిక పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నాయని, బృందాలు ఆసుపత్రిని తనిఖీ చేస్తున్నాయని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్) MK మీనా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని ఆయన అన్నారు.

Advertisement

అటు సాయంత్రం 4.26 గంటలకు సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు తెలియడంతో అక్కడికి కూడా ప్రత్యేక బృందాలను పంపించామని ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి తెలిపారు. వీటితో పాటు హిందూరావు హాస్పిటల్‌తో సహా మరో ఎనిమిది నుంచి 10 ఆసుపత్రులకు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇక సాయంత్రం 6.15 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ తెలిపారు.

Advertisement

Also Read: ఢిల్లీలో తీవ్ర కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్

ఇటీవలి కాలంలో ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 130కి పైగా పాఠశాలలకు తమ ప్రాంగణంలో పేలుడు పదార్థాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఒకే రకమైన ఈమెయిల్‌లు వచ్చాయి. బెదిరింపులు విస్తృతమైన భయాందోళనలకు దారితీశాయి, దీని ఫలితంగా తక్షణ తరలింపులు, విద్యాసంస్థలపై సమగ్ర శోధనలు జరిగాయి.

ఈమెయిల్‌ల, ఖచ్చితమైన మూలాన్ని కనుగొనడానికి ఢిల్లీ పోలీసులు ఇంటర్‌పోల్ ద్వారా రష్యన్ మెయిలింగ్ సర్వీస్ కంపెనీ Mail.ruని సంప్రదించారు. బాంబు బెదిరింపులు బూటకమని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×