E-Paper
Advertisement

PM Modi: ఈ నెల 14న మోదీ నామినేషన్.. భారీగా నేతల ఏర్పాట్లు

PM Modi: ఈ నెల 14న మోదీ నామినేషన్.. భారీగా నేతల ఏర్పాట్లు
Advertisement

Modi Nomination: ప్రధాని మోదీ ఈ నెల 14న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మోదీ నామినేషన్ కోసం బీజేపీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా మోదీ వారణాసిలో రెండు రోజుల పాటు ఉంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని ఉండే రెండు రోజుల్లో భారీ రోడ్ షోలు, ప్రచార సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

మోదీ నామినేషన్ ఏర్పాట్లను కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత సునీల్ బన్సల్ కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వారణాసిలో ప్రధాని నామినేషన్ కు ముందు పలు ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంది. కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను మోదీ దర్శించుకోనున్నట్లు సమాచారం.

Advertisement

బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు ఐదు కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది. రోడ్ షో అనంతరం ఎన్డీఏ నేతలతో మోదీ సమావేశంలో పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రధాని బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మే 30 వరకు మోదీ ఎన్నికల ప్రచారాలు కొనసాగనున్నాయి.

Also Read:  10 గ్యారంటీలతో అరవింద్ కేజ్రీ’వార్’

Advertisement

7వ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉత్తర ప్రదేశ్ లోక్ సభ స్థానాల్లో వారణాసి ఒకటి. వారణాసి బీజేపీకి కంచుకోటగా చెబుతారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ సమాజ్ వాదీ పార్టీ నుంచి బరిలో దిగిన షాలినీ యాదవ్ పై విజయం సాధించారు. ఇక్కడ సుమారు 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10.65 లక్షల మంది  పురుషులు కాగా 8.97 లక్షల మంది మహిళలు, 135 థర్డ్ జెండర్స్ ఉన్నారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×