BigTV English
Advertisement

Case on Minister Anitha R Radhakrishnan: మోదీపై ఘాటు వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై కేసు!

Case on Minister Anitha R Radhakrishnan: మోదీపై ఘాటు వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై కేసు!
DMK Minister Anitha R Radhakrishnan
DMK Minister Anitha R Radhakrishnan

Filed a Case against DMK Minister Anitha R Radhakrishnan: తమిళనాడులో బలం పెంచుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ముందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టింది. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆమె ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సినీ ప్రముఖలకు కాషాయ పార్టీ గాలం వేసింది. రాధికా శరత్ కుమార్ కు ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.


తమిళనాడులో బీజేపీ దూకుడు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికార పార్టీ డీఎంకే ఎదురుదాడికి దిగుతోంది.  ఈ క్రమంలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్  ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్చి 22న తండుపాతులో డీఎంకే కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. దివంగత సీఎం కామరాజ్ ను మోదీ పొగడటంపై మండిపడ్డారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు.

Also Read: పాతగూటికి చేరిన గాలి.. ఇప్పుటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్!


తమిళనాడు మంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పేర్కొంటూ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనితా ఆర్. రాధాకృష్ణన్ పై కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తమిళనాడులో 39 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. ఏప్రిల్ 19న రాష్ట్రంలో ఎన్నికల జరగనున్నాయి.

Tags

Related News

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

Dog Bite Victims: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక మలుపు.. బాధితుల జోక్యానికి గ్రీన్ సిగ్నల్!

Supreme Court: భారత్ లో పోర్నోగ్రఫీ బ్యాన్ చేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Big Stories

×