E-Paper
Advertisement

Erode MP Suicide : తమిళనాడులో విషాదం.. టికెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య

Erode MP Suicide : తమిళనాడులో విషాదం.. టికెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య
Advertisement

erode mp ganesamoorthy death news

Erode MP Ganesha Moorthy Suicide(Political news telugu): తనకు ఈసారి ఎంపీ టికెట్ కేటాయించలేదని మనస్తాపం చెందిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత గణేశమూర్తి (77) ఆత్మహత్యాయత్నం చేసి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. మరికొద్దిరోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఈ విషాదకర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. గణేశమూర్తికి 2019 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో స్థానం దక్కింది. ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన డీఎంకే గుర్తుపైనే పోటీ చేసి గెలిచారు.

Advertisement

అయితే తాజా లోక్ సభ ఎన్నికల్లో.. కూటమి సీట్ల సర్దుబాటులో టికెట్ ను ఎండీఎంకేకుతిరుచ్చి టికెట్ ఇచ్చింది. అక్కడి నుంచి దురైవైగోను అభ్యర్థిగా ప్రకటించింది. తనకు టికెట్ కేటాయించకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని గణేశమూర్తి మీడియాకు తెలిపారు. గణేశమూర్తిని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నామని, దురైవైగోకు ఎంపీ టికెట్ ఇవ్వడం ఆయనకు నచ్చకపోతే తనకు నచ్చింది చేసుకోవచ్చని ఎండీఎంకే అధిష్ఠానం తెలిపింది.

Also Read : పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ కేసు..

Advertisement

దాంతో గుర్తుమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మార్చి 24న విషపూరితమైన ట్యాబ్లెట్లను మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆయన్ను కోయంబత్తూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. నాలుగు రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. 5.05 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేశమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెరుందురైలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

కాగా.. ఎంపీ గణేశమూర్తి 1947 జూన్ లో జన్మించారు. 1993లో ఎండీఎంకే పార్టీ ప్రారంభమవ్వగా.. నాటి నుంచీ ఆ పార్టీలోనే ఉన్నారాయన. 1998లో తొలిసారి పళని పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2009, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×