BigTV English
Advertisement

Central Budget: కేంద్ర బడ్జెట్‌లో వారికైతే అదిరిపోయే న్యూస్.. అందులో మీరున్నారా..?

Central Budget: కేంద్ర బడ్జెట్‌లో వారికైతే అదిరిపోయే న్యూస్.. అందులో మీరున్నారా..?

Central Budget: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్ నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగ వర్గానికి తీపి కబురు అందించింది. ఉద్యోగులకు సంబంధించిన ఆదాయ పన్ను నిబంధనలపై ఊరట కలిగించే అంశాలన కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇన్‌కామ్ ట్యాక్స్ నిబంధనల్లో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి.ప్రస్తుత సమాజంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడంతో సంపాదన రేటు పెరుగుతోంది. దీంతో కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రేటు అంతకంతకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ప్రత్యక్ష పన్నుల స్లాబులు, రేట్లు కూడా మారుతున్నాయి. అయితే కేంద్ర ఈసారి ఆశించినదాని కన్నా ఎక్కువ మార్పులు చేర్పులు చేసింది. ఆదాయపు వనరులు పెరిగినందున స్లాబుల వ్యాప్తి పెంచి.. పన్ను రేట్లను కూడా మార్చాలన్న ఉద్యోగుల డిమాండ్లకు కేంద్రం పట్టించుకుంది.


ప్రస్తుత పాత పన్ను ప్రకారం చూసుకుంటే.. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 పన్నులేని పరిమితి రూ.2.5లక్షల నుంచి 5లక్షల వరకు ఐదుశాతం.. రూ.10లక్షల వరకు 20 శాతం, రూ.10 లక్షల నుంచి 30 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ప్రస్తుత కొత్త పన్ను ప్రకారం చూసుకుంటే.. స్టాండర్డ్ డిటెక్షన్ రూ.75000 పన్ను రిబేట్‌తో కలిపి పన్నులేని పరిమితి ఏడు లక్షల వరకు, రూ.7లక్షల నుంచి రూ.10లక్షల వరకు పది శాతం, రూ.10లక్షల నుంచి రూ.12లక్షల వరకు పదిహేను శాతం, రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వరకు 20 శాతం, 15లక్షలకు పైబడితే ఆదాయంపై 30 శాతం పన్ను వసూలు చేస్తారు. దీనిలో ఎలాంటి సేవింగ్స, ఇతర తగ్గింపులు ఉండవు.

మారిన స్లాబుల ప్రకారం చూసుకుంటే.. ఇప్పటి వరకు అమలులో ఉన్న కొత్త పన్ను విధానంలో రూ.7.75లక్షల వరకు పన్ను పూర్తిస్థాయిలో మినహాయింపు ఉండేది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మారిన స్లాబుల ప్రకారం.. రూ.0-4లక్షల వరకు జీరో శాతం ట్యాక్స్, రూ.4 నుంచి రూ.8 లక్షల వరకు 5శాతం, రూ.8 నుంచి రూ.12లక్షల వరకు 10 శాతం, రూ.12-16లక్షల వరకు 15 శాతం రూ.16లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24లక్షల వరకు 25 శాతం, రూ.24 లక్షలకు పైబడితే 30 శాతం ట్యాక్స్ విధిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూ.12లక్షల ట్యాక్స్ రిబేట్ ప్రకటించింది. అంటే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలతో కలిపి రూ.12 లక్షల 75 వేల ఆదాయం ఉన్నవారికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఒక శుభవార్తగా చెప్పవచ్చు. గత 25 ఏళ్లుగా మారని ఆదాయపు పన్ను నిబంధనలను ఈ సారి మార్చింది. దీంతో కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంచనుంది.


Also Read: Project Manager Jobs: NHAIలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.17,00,000 జీతం..

మారిన ట్యాక్స్ నిబంధనలు మొత్తం ఆదాయంపై లెక్కించనున్నారు. దీని వల్ల పొదుపుల పట్ల నిరాధారణ పెరిగే అవకాశం ఉంది. సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సహించే రుణాల పట్ల నిరాసక్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పట్లో సీపీఎస్ రద్దయ్యే అవకాశం లేనందున ఆ స్కీంకు చెల్లించే మొత్తాలకు ట్యాక్స్ మినహాయింపు ఉండదు. కావున కేంద్రం మరోసారి ఆలోచించి సేవింగ్‌కు సీపీఎస్ మొత్తాలకు ఇంటికి సంబంధించిన వడ్డీ, అసలు పన్ను నుంచి మినహాయింపు ఇస్తే మరింతగా ట్యాక్స్ చెల్లింపుదారుల శాతం పెరుగుతోంది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×