BigTV English
Advertisement

Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?

Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?

Gujarat Tragedy: గుజరాత్‌ రాష్ట్రంలోని పంచ్‌ మహల్ జిల్లాలోని ప్రసిద్ధ పాల్గఢ్ హిల్ శక్తి పీఠం వద్ద విషాదం చోటుచేసుకుంది. కార్గో రోప్‌వే వైర్ ఆకస్మికంగా తెగిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్‌ మెన్లు, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో జరిగిందని తెలిపారు. నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. పాల్గఢ్ కొండపై ఉన్న మహాకాళి ఆలయాన్ని ఏటా 25 లక్షల మంది సందర్శిస్తుంటారని అంచనా.


ప్రమాదంపై స్పందించిన పంచ్‌మహల్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ హరీష్ దుధత్ వివరాలను తెలిపారు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే ఆ ప్రాంతమంతా భయాందోళనకు గురైందని వెల్లడించారు. పాల్గఢ్ కొండ సముద్ర మట్టానికి దాదాపు 800 మీటర్ల ఎత్తులో ఉంటుందరని తెలిపారు. ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు 2000 మెట్లు ఎక్కాలి లేదా రోప్‌వే ద్వారా వెళ్లాల్సి ఉంటుందన్నారు.

Also Read: OTT Movie : వరుస హత్యలు చేస్తూ సిటీని వణికించే మాస్క్ మ్యాన్… నరాలు తెగే ఉత్కంఠ… ఈ సైకో చేసే పనులకు థ్రిల్ పక్కా


సంఘటనలు జరగకుండా చూడాలి.. భక్తులు డిమాండ్

అయితే, వస్తువులను మోసుకెళ్లడానికి ఉపయోగించే కార్గో రోప్‌వేలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాలులు బలంగా వీస్తుండటంతో ముందే రోప్‌వే సర్వీసులను నిలిపివేశారని అధికారులు వెల్లడించారు. మహాకాళి అమ్మవారికి అంకితం చేసిన ఈ పాల్గఢ్ శక్తి పీఠానికి ప్రతి సంవత్సరం సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే ఈ ప్రమాదం కారణంగా అక్కడి భక్తుల్లో భయాందోళనకు గురయ్యారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆరుగురు మరణించినట్టు, మృతదేమాలను పోస్ట్‌మార్టంకు తరలించామని తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలపై పూర్తి సాంకేతిక దర్యాప్తు అనంతరమే స్పష్టత వస్తుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం, మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషాదం పాల్గఢ్‌లో దర్శనానికి వచ్చే భక్తులను తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కట్టుదిట్టమైన సహాయక చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి, ఆలయానికి వెళ్లే దారులను ఎటువంటి ఆటంకంట లేకుండా నిర్మించాలని కోరుతున్నారు.

Related News

America Vs Russia: వలపు వల.. అమెరికా విలవిల, టెక్ కంపెనీల ట్రేడ్ సీక్రెట్లన్నీ బయటకు.. ఇది ఎవరి పని?

Diwali Tragedy: దీపావళి రోజు ‘కార్బైడ్ గన్’తో ఆటలు.. కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు!

Tejaswi Yadav: మహాగఠ్‌ బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌

Bihar Elections: గెలుపు కోసం ఆరాటం.. వరాల జల్లు కురిపిస్తోన్న రాజకీయ పార్టీలు, బీహార్ ప్రజల తీర్పు ఏమిటో?

Mehul Choksi: టీవీ, వెస్ట్రన్ టాయిలెట్.. చోక్సీ కోసం ముంబై జైల్లో స్పెషల్ బ్యారెక్ రెడీ!

Satish Jarkiholi: ఎవరీ సతీష్ జార్ఖిహోళి.. కర్నాటక సీఎం రేసులో డీకేకి ప్రధాన ప్రత్యర్థి ఈయనేనా?

Droupadi Murmu: శబరిమలలో రాష్ట్రపతి.. భక్తితో ఇరుముడి సమర్పించిన ద్రౌపది ముర్ము!

Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో టెక్నికల్ ఎర్రర్! గంటసేపు గాల్లోనే..

Big Stories

×