E-Paper
Advertisement

Himachal Pradesh:హిమాచల్ ప్రదేశ్ లో 14 రోడ్లు మూసివేత

Himachal Pradesh:హిమాచల్ ప్రదేశ్ లో 14 రోడ్లు మూసివేత
Advertisement

Himachal Pradesh Heavy rains effect(Telugu news live): దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. అనేక నదులు,వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోనూ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడ స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో అక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కిన్నౌర్ జిల్లాలో నిరంతరం రద్దీగా ఉండే కొండ ప్రాంతంలో భారీగా కొండ రాళ్లు విరిగిపడ్డాయి. దానితో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఆ రోడ్డును మూసివేశారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో రాకపోకలపై నిషేధాజ్ణలు విధించారు. ఇలాంటివే మరికొన్ని ప్రమాద కర రహదారులను గుర్తించారు. దాదాపు 14 రోడ్లు మూసివేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని..చాలా చోట్ల ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. అత్యవసరం అయితే తప్ప వాహనాలు బయటకు తీయొద్దని హెచ్చరిస్తున్నారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు

Advertisement

మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గత నెలలో కురిసిన వర్షాలతో భారీగా ఆస్తి నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు. దాదాపు మూడువందల కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అలాగే వరదలు, వర్షాలకు ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య నలభై నాలుగు మందిగా ప్రకటించారు. రాగల 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. చంబా, మండి జిల్లాలకు భారీ వర్షాల ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని..లోతట్టు ప్రాంత ప్రజలు హెల్పింగ్ కేంద్రాల నుంచి అవసరమైతే సహాయం పొందాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సెలవలు రద్దు చేసింది. అంతా అప్రమత్తమై ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను సూచించింది.

Related News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

Big Stories

Advertisement
×