E-Paper
Advertisement

Kota Hostel Fire Accident: కోట హాస్టల్ లో భారీ అగ్నిప్రమాదం!

Kota Hostel Fire Accident: కోట హాస్టల్ లో భారీ అగ్నిప్రమాదం!
Advertisement

Fire Accident in Kota Boys Hostel in Rajasthan: రాజస్థాన్ లోని కోటాలో గల ఒక బాలుర హాస్టల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఒక ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటలో ల్యాండ్ మార్క్ సిటీలో జరిగిందీ ఘటన.

ఐదు అంతస్తుల హాస్టల్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి.. ఘటనకు గల పూర్తి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు గాయపడగా.. వారిలో ఒకరికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. హాస్టల్ లో ఉన్న విద్యార్థులను మరో హాస్టల్ కు తరలించారు. 8 మంది విద్యార్థుల్లో ఆరుగురు చికిత్స పొంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇద్దరు మాత్రం ఇంకా చికిత్స పొందుతున్నారు.

Advertisement

Also Read: ఎన్నికల వేళ, 1425 కేజీల బంగారం సీజ్, ఎక్కడ?

ప్రమాద సమయంలో భవనంలో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలను చూసిన ఒక విద్యార్థి మొదటి అంతస్తు నుంచి దూకడంతో.. అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది. హాస్టల్ భవనంలో అగ్నిమాపక భద్రతా చర్యలు లేవని, అగ్నిమాపక ఎన్‌ఓసి కూడా లేదని పోలీసులు గుర్తించారు. హాస్టల్ భవనంలో ఇంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయకూడదని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైన ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు కోట ఏఎస్పీ అమృత దుహానీ తెలిపారు.

Tags

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×