BigTV English

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!
Advertisement

India Post: భారత పోస్టల్ శాఖ ఒక్కసారిగా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాకు ఏ రకమైన పోస్ట్ సరఫరాలు కూడా జరగవని స్పష్టంగా ప్రకటించింది. వ్యక్తిగత లేఖలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, గిఫ్టులు.. ఇవన్నీ ఒక్కటీ ఇక అమెరికా వైపు వెళ్ళవు. ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోస్టల్ శాఖ అధికారికంగా వెల్లడించింది.


ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, వ్యాపారులు, విద్యార్థులు ఎవరికైనా భారతదేశం నుంచి ఏదైనా వస్తువు పంపాలన్నా ఇదే పెద్ద సమస్యగా మారింది. పుట్టినరోజు కానుకలు, వ్యక్తిగత పత్రాలు, వ్యాపార రవాణాలు, ఎగుమతులు.. ప్రతి విభాగంపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతోంది.

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాణిజ్య రంగం
అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులకు వస్తువులు పంపించే సాధారణ వ్యక్తుల నుంచి, చిన్న ఎగుమతిదారుల వరకు అందరూ ఈ నిర్ణయంతో తలనొప్పి పడుతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ వ్యాపారాలు, ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను సమయానికి డెలివరీ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పరిశ్రమలు, హ్యాండీక్రాఫ్ట్ వ్యాపారులు, హోమ్ బేస్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఈ తాత్కాలిక నిలిపివేత పెద్ద దెబ్బే అని నిపుణులు చెబుతున్నారు.


అమెరికా కొత్త నిబంధనలే కారణం
ఈ నిర్ణయానికి కారణం అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త టారిఫ్ మరియు కస్టమ్స్ మార్గదర్శకాలు. జూలై 30, 2025 నుంచి అమెరికా ప్రభుత్వం “డీ మినిమిస్ రూల్” ను పూర్తిగా రద్దు చేసింది. అంటే చిన్న చిన్న పార్సిళ్లపైనా ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీలు, అదనపు ఛార్జీలు తప్పనిసరి అవుతున్నాయి. ఈ మార్పుల తర్వాత, అమెరికా కస్టమ్స్‌కు అనుగుణంగా రవాణా ప్రక్రియలను నిర్వహించడం కష్టంగా మారిందని పోస్టల్ శాఖ తెలిపింది. స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల కొత్త నిబంధనల కింద సరుకులను క్లియర్ చేయడం దాదాపు అసాధ్యం అవుతోంది.

సాంకేతిక సమస్యలూ అడ్డంకులే
ఈ పరిస్థితుల్లో కేవలం కస్టమ్స్ మార్పులు మాత్రమే కాదు, సాంకేతిక సమస్యలు కూడా అడ్డంగా మారాయి. కొత్త టారిఫ్ ప్రాసెసింగ్ కోసం సిస్టమ్ అప్డేట్స్ పూర్తి కాలేదని, క్యారియర్స్ కూడా తమ వైపు నుంచి పూర్తి రెడీగా లేరని సమాచారం. దీంతో, ప్రస్తుతానికి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అన్ని రకాల పోస్టును తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే బుక్ చేసిన పార్సిళ్ల పరిస్థితి
ఇప్పటికే బుక్ చేసిన లేఖలు, పార్సిళ్లు, గిఫ్టులు వంటి వాటికి మాత్రం రిఫండ్ చేసే అవకాశం ఉంటుందని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ సరుకులు అమెరికాకు చేరడం లేదా తిరిగి పంపించడం అసాధ్యమని స్పష్టంగా తెలిపింది.

ప్రజల్లో అసహనం
ఈ నిర్ణయం బయటకు రాగానే, అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులకు ఏదైనా పంపించాలనుకున్న వారు నిరాశ చెందుతున్నారు. పెద్దగా ఏ వస్తువూ కాదు, ఒక చిన్న లేఖ కూడా పంపించుకోలేకపోతున్నామని అనేక మంది బాధ వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య రంగం కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా ఎగుమతిదారులు తమ ఆర్డర్లు నిలిచిపోవడంతో ఆర్థిక నష్టం కలుగుతుందని చెబుతున్నారు.

పరిష్కారం ఎప్పుడొస్తుందో?
పోస్టల్ శాఖ ఈ సమస్య తాత్కాలికమేనని స్పష్టం చేస్తోంది. అమెరికా నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాకనే సర్వీసులు మళ్లీ ప్రారంభమవుతాయని అంచనా వేస్తోంది. ప్రస్తుత పరిస్థితిని మేము దగ్గరగా పరిశీలిస్తున్నాం. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Also Read: Free Toll Plaza: పేరుకే టోల్‌ ప్లాజా.. ఇక్కడ ఒక్క వాహనం ఆగదు.. అసలు కారణం ఇదే!

డిజిటల్ కస్టమ్స్ వ్యవస్థ అవసరం
నిపుణులు చెబుతున్నట్టు, ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా ఉండాలంటే డిజిటల్ కస్టమ్స్ ప్రాసెసింగ్ వ్యవస్థను పూర్తిగా అప్‌డేట్ చేయడం తప్పనిసరి. అమెరికా కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి, చిన్న రవాణాలపై రూల్స్ క్లియర్ చేయాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ లాజిస్టిక్స్ రంగంలో సమన్వయం లేకపోతే ఇలాంటి సమస్యలు తరచూ రావచ్చని హెచ్చరిస్తున్నారు.

గ్లోబల్ ఈ-కామర్స్ పై ప్రభావం
ఈ తాత్కాలిక నిలిపివేత వల్ల గ్లోబల్ ఈ-కామర్స్ రంగం కూడా కుదేలైంది. అమెరికాకు ఉత్పత్తులు పంపే చిన్న వ్యాపారులు, అమెజాన్, ఎట్సీ, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఎగుమతులు చేసే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రిఫండ్‌లు, మరోవైపు కస్టమర్ అసంతృప్తి ఇవన్నీ కలగలసి వ్యాపారులకి పెద్ద సమస్యగా మారాయి.

ప్రస్తుతం ఈ పోస్టల్ నిలిపివేత తాత్కాలికమే అయినా, దాని ప్రభావం పెద్దదే. వ్యక్తిగత లేఖలు నుంచి పెద్ద వ్యాపార రవాణాల వరకు ప్రతి విభాగం దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అమెరికా నుండి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే వరకు భారత పోస్టల్ శాఖ ఏ రకమైన పోస్టునూ బుక్ చేయదని తెలిపింది.

Related News

Pakistan – Afghanistan: ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్థాన్ -అఫ్గానిస్థాన్

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్

Transgenders Suicide Attempt: ఫినైల్ తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన 24 మంది హిజ్రాలు.. అసలు ఏమైంది?

Heavy Rains: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Big Stories

×