E-Paper
Advertisement

ISRO Chief Somnath : ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌కు క్యాన్సర్‌.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం రోజే నిర్ధారణ..

ISRO Chief Somnath : ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌కు క్యాన్సర్‌..  ఆదిత్య ఎల్-1 ప్రయోగం రోజే నిర్ధారణ..
Advertisement

ISRO Chief Somnath

ISRO: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు క్యాన్సర్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ఆలస్యంగా బయటపెట్టారు. ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టిన సమయంలో తనకు క్యాన్సర్ సోకిందని తేలిందన్నారు. వైద్య పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.

Advertisement

చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని సోమనాథ్ చెప్పారు. కానీ ఆరోగ్య సమస్యలపై స్పష్టత రాలేదన్నారు. సూర్యుడిపై అధ్యనయం కోసం భారత్ ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టిన రోజు హెల్త్ చెకప్ చేయించుకున్నానని తెలిపారు. టెస్టుల్లో అనారోగ్య సమస్యలను వైద్యులు గుర్తించారని పేర్కొన్నారు. ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగం పూర్తైన తర్వాత చెన్నైలో స్కానింగ్ చేయించానని తెలిపారు.

తన కడుపులో కణితిని వైద్యులు గుర్తించారని సోమనాథ్ వెల్లడించారు. ఆ కణితి బాగా పెరిగిందని నిర్ధారించారన్నారు. ఆ తర్వాత క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని వివరించారు. ఇది వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ అని పేర్కొన్నారు. తనకు క్యాన్సర్ సోకిందని తెలియగానే ఫ్యామిలీ ఆందోళనకు గురైందని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు షాక్ కు గురయ్యారని చెప్పారు.

Advertisement

Read More : విద్యారంగానికి పెద్దపీట.. 16 వేల కోట్లు కేటాయించిన ఢిల్లీ ప్రభుత్వం..

2023 సెప్టెంబర్‌ 2న ఇస్రో ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం పూర్తైన తర్వాత వైద్యుల సూచనలో సోమనాథ్ ఆపరేషన్ చేయించుకున్నారు. నాలుగురోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. ఆపరేషన్ తర్వాత కీమోథెరపీ చేయించుకున్నారు. ఆపరేషన్ పూర్తైన ఐదో రోజు నుంచి ఇస్రో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాలను ఓ మళయాల వెబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 

Tags

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×