E-Paper
Advertisement

Japan Smart Signals: జపాన్ సాంకేతికతతో స్మార్ట్ సిగ్నళ్లు..

Japan Smart Signals: జపాన్ సాంకేతికతతో స్మార్ట్ సిగ్నళ్లు..
Advertisement

Japanese Signal System In Bangalore: ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న టాప్ టెన్ నగరాల్లో బెంగళూరు ఒకటి. ఈ సమస్యను అధిగమించేందుకు దేశంలోనే తొలిసారిగా జపనీస్ సాంకేతికతతో కూడిన ట్రాఫిక్ వ్యవస్థ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి టెస్టింగ్, ట్రయళ్లు ముగిశాయి.
అనుకున్నట్టు అన్నీ విజయవంతమైతే వచ్చే నెలాఖరుకే ఈ స్మార్ట్ సిగ్నళ్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. కెన్సింగ్టన్ రోడ్, మర్ఫీ రోడ్ జంక్షన్లలో ఆ వ్యవస్థ పరీక్షలు ఇటీవలే ముగిశాయి.

అడ్వాన్డ్స్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్(ATIMS) ఏర్పాటుకు జపనీస్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ(JICA) నిధులు అందజేసింది. ఈ సిస్టమ్ ద్వారా జంక్షన్లలో రద్దీని బట్టి ఆటోమేటిక్‌గా సిగ్నల్స్ మారతాయి. వాస్తవానికి 2014లోనే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వెలువడినప్పటికీ.. ఒప్పందంపై సంతకాలు జరిగింది మాత్రం 2021లోనే. ఆ తర్వాతా పలు కారణాల వల్ల ప్రాజెక్టు అమలులో తీవ్ర జాప్యం జరిగింది.
బెంగళూరులోని 28 ప్రధాన కూడళ్లలో ఈ వ్యవస్థను నెలకొల్పినట్టు డైరెక్టరేట్ ఆఫ్ అర్బన్ అండ్ లాండ్ ట్రాన్స్ పోర్ట్(DULT) అధికారులు వెల్లడించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జంక్షన వద్ద వాహనాల బారు 30% మేర తగ్గుతుందని చెబుతున్నారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×