E-Paper
Advertisement

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి.. బ్యాంకులో బంగారం చోరీ..

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి.. బ్యాంకులో బంగారం చోరీ..
Advertisement

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి బ్యాంకులోని స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న 1.8 కేజీల బంగారాన్ని దొంగలించారు దుండగులు. ఈ దోపిడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భనుతి ఎస్బీఐ శాఖలో జరిగింది.

దుండగులు పక్కా ప్లాన్‌తో భనుతి శాఖ బయటి నుంచి బ్యాంకులోనికి 10 అడుగుల సొరంగం తవ్వారు. బ్యాంకు కార్యాలయంలో ఎవ్వరూ లేని సమయంలో లోపలికి వెళ్లి సుమారు రూ.కోటి విలువ చేసే 1.8 కేజీల బంగారాన్ని దొంగలించారు.

Advertisement

బ్యాంకులోంచి మొత్తం ఎంత దోపిడీ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి అధికారులకు చాలా సమయం పట్టింది. అయితే బ్యాంకు దోపిడీ సమయంలో అక్కడ రూ.34 లక్షల క్యాష్ ఉన్నా దాన్ని దొంగలించడానికి వారికి వీలుపడలేదుని పోలీసులు తెలిపారు. లభ్యమైన కొన్ని ఆధారాల ద్వారా దొంగలను పట్టుకొనే పనిలో ఉన్నామన్నారు డీజీపీ విజయ్ డూల్.

బ్యాంకు నిర్మాణం పనులు బాగా తెలిసినవారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను రంగంలోకి దించామన్నారు సీపీ బీపీ జోగ్దండ్.

Tags

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×