BigTV English

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి.. బ్యాంకులో బంగారం చోరీ..

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి.. బ్యాంకులో బంగారం చోరీ..

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి బ్యాంకులోని స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న 1.8 కేజీల బంగారాన్ని దొంగలించారు దుండగులు. ఈ దోపిడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భనుతి ఎస్బీఐ శాఖలో జరిగింది.


దుండగులు పక్కా ప్లాన్‌తో భనుతి శాఖ బయటి నుంచి బ్యాంకులోనికి 10 అడుగుల సొరంగం తవ్వారు. బ్యాంకు కార్యాలయంలో ఎవ్వరూ లేని సమయంలో లోపలికి వెళ్లి సుమారు రూ.కోటి విలువ చేసే 1.8 కేజీల బంగారాన్ని దొంగలించారు.

బ్యాంకులోంచి మొత్తం ఎంత దోపిడీ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి అధికారులకు చాలా సమయం పట్టింది. అయితే బ్యాంకు దోపిడీ సమయంలో అక్కడ రూ.34 లక్షల క్యాష్ ఉన్నా దాన్ని దొంగలించడానికి వారికి వీలుపడలేదుని పోలీసులు తెలిపారు. లభ్యమైన కొన్ని ఆధారాల ద్వారా దొంగలను పట్టుకొనే పనిలో ఉన్నామన్నారు డీజీపీ విజయ్ డూల్.


బ్యాంకు నిర్మాణం పనులు బాగా తెలిసినవారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను రంగంలోకి దించామన్నారు సీపీ బీపీ జోగ్దండ్.

Tags

Related News

Aadhar – Pan Cards: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ.. దానికి పనికి రావు

Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Big Stories

×