E-Paper
Advertisement

Update on Kavitha Bail Petition: కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ.. ఏప్రిల్ 8న తీర్పు..!

Update on Kavitha Bail Petition: కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ.. ఏప్రిల్ 8న తీర్పు..!
Advertisement
Kavitha Bail petition update
Kavitha Bail petition update

Update on Kavitha Bail petition: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన రూస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8న న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెల్లడించనున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు రూస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను విచారించారు. కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

Advertisement

కవిత అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని.. చట్ట విరుద్ధమని అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అతను భయంతో ఉన్నాడని.. ఈ సమయంలో తల్లి పాత్ర అవసరమని అన్నారు.

మరోవైపు వాదనలు వినిపించిన ఈడీ, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర కవిత పోషించారని, ప్రణాలికలు రచించింది కూడా కవితనేనని స్పష్టం చేశారు. కవిత తన ఫోన్లో కీలక డేటాను డిలీట్ చేశారని, నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని తెలిపారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి బవిజా తీర్పును రిజర్వ్ చేశారు.

Advertisement

Also Read: కేజ్రీవాల్ ఫోన్ అనలాక్‌కు నో చెప్పిన ఆపిల్.. తలపట్టుకున్న ఈడీ..

మద్యం స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీ వరకూ ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలులో ఉన్నారామె. కస్టడీకి ముందే బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలున్న కారణంగా ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేసి కవితకు అనుకూలంగా బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి.

ఇక .. ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఏప్రిల్ 15 వరకూ ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో.. తీహార్ జైలుకు తరలించారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×