Kerala: వీడు భర్త కాదు.. పరమ నీచుడు. ఇంకా వాడ్ని వర్ణించాలంటే మాటలు చాలవు. కూతురి ముందు భార్యపై ఏకాంతానికి దిగారు కామాంధుడు. అంతేకాదు ఏకాంతంగా ఉన్న వీడియోలను చిత్రీకరించి కొన్ని సైట్లలో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. చివరకు భార్య సన్నిహితులు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు భార్య ఫిర్యాదుతో పోలీసులు ఆ కామాంధుడ్ని అరెస్టు చేశారు పోలీసులు. సంచలనం రేపిన ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. కేరళంలోని మయ్యనాడ్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల వ్యక్తి.. భార్య-కూతురుతో కలిసి యూకేలో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. ఆరేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే మానేసి భర్త, భార్యతోపాటు యూకే వెళ్ళాడు. ఈ జంటకు ప్రస్తుతం కూతురు వయస్సు నాలుగేళ్లు. యూకేలో ఉన్నప్పుడు భార్య స్నేహితులు ఫోన్ చేసిన నీకు సంబంధించిన ఏకాంతం వీడియోలు ఫలానా వెబ్సైట్లో ఉన్నాయని చెప్పింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. ఆ విధంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆయా వీడియోలు అప్లోడ్ చేయడంపై భర్తను హెచ్చరించింది భార్య. అప్లోడ్ చేసిన వీడియోలు నాలుగేళ్ల కుమార్తె సమక్షంలో ఏకాంతంగా ఉన్నవి. ఆ సంఘటన తర్వాత ఆ దంపతులు యూకెను విడిచిపెట్టారు. అక్కడి నుంచి తమ సొంతూరు కేరళకు తిరిగి వచ్చారు. ఈ విషయమై కౌన్సెలింగ్ వెళ్లాలని పదే పదే భర్తకు చెప్పింది భార్య. చివరకు మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ తీసుకున్నాడు. కౌన్సెలింగ్ తర్వాత కూడా ఆ చిన్నారితో కూడిన మరో వీడియోను చిత్రీకరించాడు. ఈ వ్యవహారంపై భార్య.. భర్తను నిలదీసింది. ఈక్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి, భార్యపై దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆమె ఆసుపత్రి పాలైంది.
భర్త పరిస్థితి గమనించిన భార్య, పోలీసులు ఫిర్యాదు చేసింది. జరిగినదంతా చెప్పడంతో పోక్సో చట్టం కింద ప్రత్యేక కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టగా కేసు నమోదు తర్వాత అతడు పారిపోయినట్లు సమాచారం. ఎట్టకేలకు నిందితుడి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు, అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, మొబైల్ ఫోన్లు, ఇతర సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. భార్యల మార్పిడిలో పాల్గొనమని ఒత్తిడి చేసేవాడని, అందుకు ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది.
ALSO READ: ప్రియురాలితో 3400 సార్లు ముద్దులు.. చిక్కుల్లో ప్రియుడు, ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
తొలుత దీని గురించి చెప్పగానే పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనక్కి తగ్గారట. చివరకు ఫిర్యాదుదారు తరపు లాయర్ కేరళ హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమైనప్పుడు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసు విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.