BigTV English

Kerala Traffic Rule:కేరళలో ఇదేం ట్రాఫిక్ రూల్ స్వామీ? తిడుతున్నారు అంతా

Kerala Traffic Rule:కేరళలో ఇదేం ట్రాఫిక్ రూల్ స్వామీ? తిడుతున్నారు అంతా

Kerala traffic police new rule to bike riders(Latest telugu news): మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ పాడుకుంటూ కొందరు బైక్ రైడింగ్ ఎంజాయ్ చేస్తుంటారు. రోడ్డు మీద ఫ్లయిట్ నడిపినట్లుగా ఫీలవుతూ రయ్ మని వెళుతుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతలా వాహనదారులను కంట్రోల్ చేసినా రూల్స్ అతిక్రమిస్తునే ఉంటారు. చలాన్లు కట్టుకుంటూనే యథాప్రకారం వాహనాలను అడ్డగోలుగా డ్రైవ్ చేస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంటాయి. జనం ఇబ్బందులు పడుతున్నా పోలీసులకు కావలసింది రోడ్డు సేఫ్టీ. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నిబంధనలు విధిస్తుంటారు.


వాహనదారులకు అవగాహన

ప్రతి ఏడాదీ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పిస్తుంటారు. కేరళలోనూ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు పరుస్తున్నారు అక్కడి పోలీసులు. అయితే అత్యుత్సాహంతో కొన్ని నిబంధనలు తీవ్ర విమర్శలపాలవుతున్నాయి. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలతో సహా డబుల్స్ రైడింగ్ సమయంలో వెనక కూర్చొన్న వ్యక్తితో మాట్లాడకూడదని ఓ సరికొత్త నిబంధన విధించారు. దారి పొడవునా అలా మాట్లాడుతూ వెళుతూ తమ ఏకాగ్రత కోల్పోతున్నారని..వాహనంపై ప్రయాణించేటప్పుడు అలా మాట్లాడేవారి వలన ఎదుటివారికి కూడా ప్రమాదమే అంటున్నారు కేరళ ట్రాఫిక్ పోలీసులు.


జరిమానాలు వద్దు అవగాహన ముద్దు

కేవలం రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ఇలాంటి నిబంధనలంటూ సమర్థించుకుంటున్నారు. లాంగ్ డ్రైవింగ్ చేయాల్సివచ్చినప్పుడు అస్సలు మాట్లాడకుండా ఎలా ఉంటామని అడుగుతున్నారు వాహనదారులు. ఇక ఇంటికి వచ్చేదాకా వెనక కూర్చొన్న వ్యక్తితో మాట్లాడకుండా ఎలా ప్రయాణిస్తాం అని వాపోతున్నారు వాహనదారులు. అయితే జరిమానా ఎంత విధిస్తే బాగుంటుంది అనేది ఇంకా నిర్ణయించలేదని అంటున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుని పక్కాగా అమలు చేస్తామని అంటున్నారు కేరళ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ జరిమానాల బదులు వారికి అవగాహన కల్పిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసులపై ఫైర్

అలాంటి అవగాహన కార్యక్రమాలతో వాహనదారులలో మార్పు రాదని..కేవలం జరిమానాలు విధిస్తే గానీ వాహనదారులు మాట వినరని పోలీసులు వాదిస్తున్నారు. కొత్తగా విధించిన ఈ నిబంధనపై కేరళ ప్రజలు పోలీసుల తీరుపై విరుచుకుపడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలోనూ ఇలాంటి నిబంధనలు అమలైతే కష్టమే..తెలుగువారు మాట్లాడకుండా ప్రయాణించలేరు. ఫైనులు కట్టడానికైనా రెడీ గానీ మాట్లాడొద్దంటే మా వల్ల కాదంటారు మనవాళ్లు.

Related News

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

Big Stories

×