E-Paper
Advertisement

Modi 3.0 Cabinet: కీలక పదవులు బీజేపీకే.. మరి మిత్రపక్షాల మాటేంటి..?

Modi 3.0 Cabinet: కీలక పదవులు బీజేపీకే.. మరి మిత్రపక్షాల మాటేంటి..?
Advertisement

Key Positions in Modis Cabinet for BJP Candidates what about Alliance..?: భారత ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు మోదీ మంత్రి వర్గంలో ఎవరికి ఏయే పదవులు ఇస్తారన్న విషయంపై ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై మిత్ర పక్షనేతలతో బీజేపీ అగ్ర నేతలు సంప్రదింపులు జరిపారు.

మోదీ 3.0 కేబినెట్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మేరకు బీజేపీ కీలక నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్‌లు మిత్ర పక్షాల నేతలు చంద్రబాబు, ఏక్‌నాథ్ శిండే, నితీష్ కుమార్‌తో సంప్రదింపులు జరిపారు. కీలకమైన హోం శాఖ, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు తమ వద్దనే ఉన్నట్లు బీజేపీ సంకేతాలిచ్చింది. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మరోసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

Advertisement

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ సీఎంలు శివరాజ్ సింగ్, మనోహర్ లాల్, బసవరాజ్ బొమ్మై, సర్బానంద సోనోవాల్ మంత్రి పదవులు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంపీ రామ్మోహన్ నాయుడు, జేడీయూ నుంచి లలన్ సింగ్ లేదా సంజయ్ ఝా, రామ్ నాథ్ ఠాకూర్‌తో పాటు పలువురు మంత్రి వర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ముచ్చటగా మూడోసారి.. మోదీ 3.0 ఎలా ఉండబోతోంది?

Advertisement

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే, మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్ ప్రధాని ప్రచండ, భూటాన్ ప్రదాని తోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద కుమార్‌తో పాటు తదితర విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యాక్షుడు అహ్మద్ అఫీఫ్ ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలకు మోదీ ప్రమాణ స్వీకార ఆహ్వానం అందలేదని ఆ పార్టీ నేత జైరాం రమేష్ తెలిపారు

Tags

Related News

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Big Stories

Advertisement
×