E-Paper
Advertisement

Landslides in Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం..!

Landslides in Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం..!

Landslides in Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం చూపించింది. కులూ జిల్లాలోని మణికరన్ సాహిబ్ గురుద్వారా సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా బలమైన గాలులు వచినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వ్యూ బాగుంటుండటంతో చాలా మంది పర్యటకులు తమ కార్లను ఆపి ఫోటోలు దిగుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ఓ భారీ వృక్షం వారిపై పడటంతో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ టీంని ప్రమాదం జరిగిన స్థలానికి పంపించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు.

కాగా కొద్ది రోజుల క్రితం కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగి పడ్డ విషయం తెలిసిందే. ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×