BigTV English
Advertisement

Threat To Bihar MP: బాబోయ్ చంపేస్తాడు.. మొన్న బిష్ణోయ్‌‌‌పై సెటైర్లు, నేడు కాపాడండి అంటూ పోలీసులకు పప్పు యాదవ్ విన్నపం

Threat To Bihar MP: బాబోయ్ చంపేస్తాడు.. మొన్న బిష్ణోయ్‌‌‌పై సెటైర్లు, నేడు కాపాడండి అంటూ పోలీసులకు పప్పు యాదవ్ విన్నపం

Pappu Yadav Gets Lawrence Bishnoi Threat: నిన్న మొన్నటి వరకు లారెన్స్ బిష్ణోయ్ మీద అవాకులు చవాకులు పేలిన బీహార్ ఎంపీ పప్పూ యాదవ్, ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడ తన ప్రాణాలు తీస్తాడోనని గజ్జున వణుకుతున్నారు. నటుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యవహారంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఓ అజ్ఞాత వ్యక్తి పప్పూ యాదవ్ కు కాల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా గమనిస్తున్నాం.  సల్మాన్‌ ఖాన్‌ వ్యవహారంలో ఆయన దూరంగా ఉండాలి. లేకపోతే లేపేయడానికి వెనుకాడం. సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్‌తో నేరుగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. ఆయన మాత్రం మా కాల్స్‌ కు స్పందించటం లేదు” అన్నాడు. ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


‘జడ్’ కేటగిరీ భద్రత పెంచాలని కోరిన పప్పూ యాదవ్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి చంపుతామంటూ బెదిరింపులు రావడంతో తనకు భద్రత పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర హోంశాఖతో పాటు బీహార్ డీజీపీకి పప్పూ యాదవ్ లేఖ రాశారు. చాలా సార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. తనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చిన బెదిరింపు సందేశాలను కేంద్రానికి పంపాడు.


బిష్ణోయ్ గ్యాంగ్ ను లేపేస్తానని పప్పూ యాదవ్ వార్నింగ్

అటు, పప్పు యాదవ్‎ను బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ చేయడానికి అసలు కారణం వేరే ఉంది. రీసెంట్ గా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసింది. ఈ హత్య తర్వాత ఎంపీ పప్పూ యాదవ్‌ సిద్ధిఖీ కొడుకును కలిసి ధైర్యం చెప్పారు. పనిలో పనిగా సల్మాన్ ఖాన్ కు కాల్ చేసి భరోసా ఇచ్చారు. అంతకు ముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ నెట్ వర్క్ ను కేవలం 24 గంటల్లో అంతం​ చేస్తానని తేల్చి చెప్పారు. “ఒక క్రిమినల్ జైలులో కూర్చుని సవాల్ చేస్తున్నాడు. జనాలను చంపుతుంటే అందరూ ప్రేక్షకుల్లా చూస్తున్నారు. మూసేవాలా, కర్ణి సేన చీఫ్, ఇప్పుడు సిద్ధిఖీని చంపేశారు. ప్రభుత్వం అనుమతిస్తే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను లేకుండా చేస్తాను” అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో పప్పూకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వార్నింగ్ వచ్చింది.

Read Also: జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? సినిమా కంటే కిక్ ఎక్కించే స్కెచ్!

Read Also: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Big Stories

×