E-Paper
Advertisement

Maharastra Elections: రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేస్తున్నారు.. చ‌ర్య‌లు తీసుకోండి.. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ పై ఈసీకి ఫిర్యాదు!

Maharastra Elections: రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేస్తున్నారు.. చ‌ర్య‌లు తీసుకోండి.. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ పై ఈసీకి ఫిర్యాదు!
Advertisement

ప్ర‌జ‌ల మ‌ధ్య క‌ల్లోలం సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ, ఆయ‌న సోద‌రుడు అక్బ‌రుద్దీన్ ఓవైసీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హారాష్ట్ర చీఫ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్, ముంబై పోలీసు క‌మిష‌న‌ర్ ల‌కు శివసేన‌ లేఖ రాసింది. ఇటీవ‌ల షోలాపూర్ లో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో వీరు ఇచ్చిన ప్ర‌సంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయ‌ని ఆరోపించింది.

ఈ మేర‌కు శివ‌సేన సోష‌ల్ మీడియా ఇంఛార్జ్ రహూల్ క‌నాల్ పోల్ ప్యానెల్ రాసిన లేఖ‌లో ఓవైసీ సోద‌రులు త‌మ ప్ర‌సంగాల ద్వారా రాష్ట్రంలోని వివిధ వ‌ర్గాల వారి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశారని పేర్కొన్నారు. ఓవైసీ సోద‌రుల ప్ర‌సంగంలో ప్ర‌జాశాంతికి భంగం క‌లిగించే ప్ర‌క‌ట‌న‌లు ఉన్నాయ‌ని తెలిపారు. మ‌తం ప్రాతిప‌దిక‌న శ‌త్రుత్వం, మ‌తాల మ‌ధ్య విభ‌జ‌ను సృష్టించ‌డం లాంటివి ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

Advertisement

మ‌త సామ‌రస్యానికి విఘాతం క‌లిగించ‌డం, స‌మాజంలో అశాంతి సృష్టించ‌డం ల‌క్ష్యంగా ఓవైసీ సోద‌రుల ప్రసంగం ఉందని, వారి ప్ర‌సంగంలో నేరపూరిత కంటెంట్ స్ప‌ష్టంగా కనిపిస్తోంద‌ని పేర్కొన్నారు. వారి ఉద్వేగ‌భ‌రిత‌మైన ప్ర‌సంగాల వ‌ల్ల ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు తీవ్ర‌మైన ముప్పు ఉంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఓవైసీ సోద‌రుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని, ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ప్ర‌సంగం వీడియో ఆధారంగా స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి ద‌ర్యాప్తు చేయాల‌ని పోలీసుల‌ను కోరారు. చ‌ర్య‌లు తీసుకుంటేనే మ‌రోసారి ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఉంటాయ‌ని అధికారుల‌కు తెలిపారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×