BigTV English
Advertisement

Mahua Marriage: ఎంపీ మహువా కొత్త జీవితం.. సీక్రెట్‌గా పెద్దాయనతో పెళ్లి

Mahua Marriage: ఎంపీ మహువా కొత్త జీవితం.. సీక్రెట్‌గా పెద్దాయనతో పెళ్లి

Mahua Marriage: తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా వార్తల్లోకి వచ్చేశారు. ఆమె సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆమె లైఫ్ ఫార్టనర్ కూడా మాజీ ఎంపీ. ఆయన ఎవరోకాదు బిజూ జనతా‌దళ్‌ మాజీ ఎంపీ పినాకీ మిశ్రా. ఇరువురు జర్మనీలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.


తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఫైర్‌బ్రాండ్ అనగా ముందుగా మహువా మెయిత్రా పేరు వినిపిస్తుంది.  గతేడాది పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు ఆమె. ఆనాటి నుంచి మోదీ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ విధంగా ఆమె పాపులర్ అయ్యారు. దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు.

మొన్నటి ఎన్నికల్లో టీఎంసీ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇప్పటికీ లోక్‌సభలో ఆ పార్టీ తరపున మోదీ సర్కార్‌ను అప్పుడప్పుడు ఇరుకున పెడుతున్నారు కూడా. తాజాగా ఎంపీ మహువా మొయిత్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సీనియర్‌ న్యాయవాది, బీజేడీ నేత, పూరీ మాజీ ఎంపీ పినాకీ మిశ్రాను పెళ్లి చేసుకున్నారు.


గత నెల(మే 30న)లో వీరి వివాహ జర్మనీలో రహస్యంగా జరిగింది. సంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఎంపీ మహువా మొయిత్రా తన భర్తతో ఉన్న ఫోటోని పోస్టు చేసింది. ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

ALSO READ: బెంగుళూరు పోలీసు కమిషనర్‌పై వేటు, ఆర్బీబీపై ఎఫ్ఐఆర్ నమోదు

పశ్చిమబెంగాల్‌‌కి చెందిన 50 ఏళ్ల మహువా మెయిత్రా తొలుత కరీంపూర్‌ ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గతేడాది పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు వ్యాపారవేత్తల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఆమెపై వేటు పడింది. దీంతో ఆమె వార్తల్లో నిలిచారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లోని కృష్ణానగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ అయిన మహువా మొయిత్రా గతంలో డెన్మార్క్‌ ఫైనాన్షియర్‌ లార్స్‌ బ్రార్సన్‌‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత వారిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి మహువా కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు.

మహువా భర్త 65 ఏళ్ల పినాకీ మిశ్రా విషయానికొద్దాం. బిజూ జనతాదళ్ సీనియర్ నేత. ఆ పార్టీ నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఆయన గెలుపొందారు. తొలుత 1996లో కాంగ్రెస్‌ తరఫున పూరీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. మారిన రాజకీయ కారణాల నేపథ్యంలో బిజూ జనతాదళ్‌‌లో చేరారు. కేవలం రాజకీయనేత కాదు సుప్రీంకోర్టు న్యాయవాది కూడా. పినాకీ మిశ్రా గతంలో సంగీత మిశ్రాను పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు.

 

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×