BigTV English
Advertisement

Manipur Fresh Violence: మణిపూర్‌లో దారుణం, పంజా విసిరిన మిలిటెంట్లు

Manipur Fresh Violence: మణిపూర్‌లో దారుణం, పంజా విసిరిన మిలిటెంట్లు

Manipur fresh violance news(Telugu breaking news): మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు మళ్లీ విరిచుకుపడ్డారు. శనివారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కొందరు మిలిటెంట్లు దాడికి దిగారు. అకస్మాత్తుగా కాల్పులు జరుపుతూ బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు.


మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. మిలిటెంట్ల ఆచూకీ కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. 128 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ సబ్‌ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ ఈ దాడిలో మరణించినట్టు పోలీసులు తెలిపారు.

సీఆర్పీఎఫ్ క్యాంప్ టార్గెట్‌గా కుకి మిలిటెంట్లు కొండపై నుంచి విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. మరోవైపు దాడికి తెగబడిన మిలిటెంట్ల ఏరివేతకు భారీగా కూంబింగ్ మొదలుపెట్టినట్లు తెలిపారు. దీంతో అలర్టయిన సీఆర్పీఎఫ్ బలగాలు సమీపంలోని ప్రదేశాలను జల్లెడ పట్టారు.


ALSO READ: రేసుగుర్రం విలన్‌ రవికి రిలీఫ్, డీఎన్ఏ టెస్టుకు కోర్టు నో

గతేడాది మే చివరలో మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీలో మైతి-కూకీ తెగల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 200 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గ్రామ రక్షణ దళాలుగా తమని తాపు పిలుచుకునే ఈ మిలిటెంట్లు స్వీయ రక్షణ పేరిట హింసకు తెగబడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలావుండగా పోయినవారం జాతీయ రహదారిపై హింస రేగింది. రెండు కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×