BigTV English

Manipur Fresh Violence: మణిపూర్‌లో దారుణం, పంజా విసిరిన మిలిటెంట్లు

Manipur Fresh Violence: మణిపూర్‌లో దారుణం, పంజా విసిరిన మిలిటెంట్లు

Manipur fresh violance news(Telugu breaking news): మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు మళ్లీ విరిచుకుపడ్డారు. శనివారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కొందరు మిలిటెంట్లు దాడికి దిగారు. అకస్మాత్తుగా కాల్పులు జరుపుతూ బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు.


మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. మిలిటెంట్ల ఆచూకీ కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. 128 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ సబ్‌ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ ఈ దాడిలో మరణించినట్టు పోలీసులు తెలిపారు.

సీఆర్పీఎఫ్ క్యాంప్ టార్గెట్‌గా కుకి మిలిటెంట్లు కొండపై నుంచి విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. మరోవైపు దాడికి తెగబడిన మిలిటెంట్ల ఏరివేతకు భారీగా కూంబింగ్ మొదలుపెట్టినట్లు తెలిపారు. దీంతో అలర్టయిన సీఆర్పీఎఫ్ బలగాలు సమీపంలోని ప్రదేశాలను జల్లెడ పట్టారు.


ALSO READ: రేసుగుర్రం విలన్‌ రవికి రిలీఫ్, డీఎన్ఏ టెస్టుకు కోర్టు నో

గతేడాది మే చివరలో మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీలో మైతి-కూకీ తెగల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 200 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గ్రామ రక్షణ దళాలుగా తమని తాపు పిలుచుకునే ఈ మిలిటెంట్లు స్వీయ రక్షణ పేరిట హింసకు తెగబడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలావుండగా పోయినవారం జాతీయ రహదారిపై హింస రేగింది. రెండు కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×