Big Stories

Manipur Fresh Violence: మణిపూర్‌లో దారుణం, పంజా విసిరిన మిలిటెంట్లు

Manipur fresh violance news(Telugu breaking news): మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు మళ్లీ విరిచుకుపడ్డారు. శనివారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కొందరు మిలిటెంట్లు దాడికి దిగారు. అకస్మాత్తుగా కాల్పులు జరుపుతూ బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు.

- Advertisement -

మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. మిలిటెంట్ల ఆచూకీ కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. 128 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ సబ్‌ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ ఈ దాడిలో మరణించినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

సీఆర్పీఎఫ్ క్యాంప్ టార్గెట్‌గా కుకి మిలిటెంట్లు కొండపై నుంచి విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. మరోవైపు దాడికి తెగబడిన మిలిటెంట్ల ఏరివేతకు భారీగా కూంబింగ్ మొదలుపెట్టినట్లు తెలిపారు. దీంతో అలర్టయిన సీఆర్పీఎఫ్ బలగాలు సమీపంలోని ప్రదేశాలను జల్లెడ పట్టారు.

ALSO READ: రేసుగుర్రం విలన్‌ రవికి రిలీఫ్, డీఎన్ఏ టెస్టుకు కోర్టు నో

గతేడాది మే చివరలో మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీలో మైతి-కూకీ తెగల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 200 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గ్రామ రక్షణ దళాలుగా తమని తాపు పిలుచుకునే ఈ మిలిటెంట్లు స్వీయ రక్షణ పేరిట హింసకు తెగబడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలావుండగా పోయినవారం జాతీయ రహదారిపై హింస రేగింది. రెండు కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News