E-Paper
Advertisement

Militants Attack on Army Outpost: జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడులు, ఏం జరుగుతోంది..?

Militants Attack on Army Outpost: జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడులు, ఏం జరుగుతోంది..?

Militants attack on Army outpost in Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి.  వరుసగా మూడురోజుల్లో మూడు ఉగ్రదాడులు జరగడంతో భద్రతా బలగాలు షాకవుతున్నాయి. అసలు జమ్మూకాశ్మీర్‌లో ఏం జరుగుతోందన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.

తాజాగా బుధవారం దోడా జిల్లాలో ఆర్మీకి చెందిన తాత్కాలిక స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దాడి వెనుక ఉన్నది తామేనని ప్రకటించింది కాశ్మీర్ టైగర్స్ గ్రూప్. కాల్పులు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

పూంఛ్, రాజౌరీ ప్రాంతాలతో పోలిస్తే రియాసీలో ఉగ్ర ఘటనల తీవ్రత తక్కువగా ఉందని అంటున్నాయి భద్రతా బలగాలు. అలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు పంజా విసరడం కాస్త ఆందోళనగా ఉందని అంటున్నాయి. ఇటీవల కథువా జిల్లాలో ఓ ఇంటిపై ఉగ్రమూకలు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ఈ ఘటన అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హీరానగర్ సెక్టార్‌లో చోటు చేసుకుంది.

Also Read: వీఐపీల భద్రతలో మార్పులు, ఎన్ఎస్‌జీని తప్పించి.. ఆ స్థానంలో

ఇక జూన్ 9న రైసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. దాడుల నేపథ్యంలో బస్సు లోయలో పడిపోయింది. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు కాల్పులు కంటిన్యూ చేశారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. ఇలా వరుసగా ఉగ్రవాదులు చెలరేగిపోవడంతో భద్రత బలగాలు అంతుబట్టడం లేదు. ఇన్నాళ్లు వీరంతా ఎక్కడున్నారు? లేక సరిహద్దులను దాటి వస్తున్నారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×