E-Paper
Advertisement

Militants Attack on Army Outpost: జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడులు, ఏం జరుగుతోంది..?

Militants Attack on Army Outpost: జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడులు, ఏం జరుగుతోంది..?
Advertisement

Militants attack on Army outpost in Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి.  వరుసగా మూడురోజుల్లో మూడు ఉగ్రదాడులు జరగడంతో భద్రతా బలగాలు షాకవుతున్నాయి. అసలు జమ్మూకాశ్మీర్‌లో ఏం జరుగుతోందన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.

తాజాగా బుధవారం దోడా జిల్లాలో ఆర్మీకి చెందిన తాత్కాలిక స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దాడి వెనుక ఉన్నది తామేనని ప్రకటించింది కాశ్మీర్ టైగర్స్ గ్రూప్. కాల్పులు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

పూంఛ్, రాజౌరీ ప్రాంతాలతో పోలిస్తే రియాసీలో ఉగ్ర ఘటనల తీవ్రత తక్కువగా ఉందని అంటున్నాయి భద్రతా బలగాలు. అలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు పంజా విసరడం కాస్త ఆందోళనగా ఉందని అంటున్నాయి. ఇటీవల కథువా జిల్లాలో ఓ ఇంటిపై ఉగ్రమూకలు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ఈ ఘటన అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హీరానగర్ సెక్టార్‌లో చోటు చేసుకుంది.

Also Read: వీఐపీల భద్రతలో మార్పులు, ఎన్ఎస్‌జీని తప్పించి.. ఆ స్థానంలో

Advertisement

ఇక జూన్ 9న రైసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. దాడుల నేపథ్యంలో బస్సు లోయలో పడిపోయింది. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు కాల్పులు కంటిన్యూ చేశారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. ఇలా వరుసగా ఉగ్రవాదులు చెలరేగిపోవడంతో భద్రత బలగాలు అంతుబట్టడం లేదు. ఇన్నాళ్లు వీరంతా ఎక్కడున్నారు? లేక సరిహద్దులను దాటి వస్తున్నారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×