BigTV English

Pm Modi: ఏ శ‌క్తీ ఆర్టిక‌ల్ 370ని మ‌ళ్లీ తీసుకురాలేదు.. దేశంలో ఒకే రాజ్యాంగం.. మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pm Modi: ఏ శ‌క్తీ ఆర్టిక‌ల్ 370ని మ‌ళ్లీ తీసుకురాలేదు.. దేశంలో ఒకే రాజ్యాంగం.. మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pm Modi: మ‌హారాష్ట్ర విజ‌యంతో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వ‌హించారు. ఈ సంబురాల్లో ప్ర‌ధాని మోడీ, అమిత్ షాతో పాటూ న‌డ్డా రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ…మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని అన్నారు. కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని, అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని అభిప్రాయ‌ప‌డ్డారు. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.


Also read: జార్ఖండ్‌‌ను నిలుపుకున్న ఇండియా కూటమి.. 81కి 55 స్థానాల్లో విజయబావుటా

ఉత్త‌ర్ ప్ర‌దేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరిందని చెప్పారు. 50 ఏళ్ల త‌ర‌వాత ఇది అతిపెద్ద విజయం అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలారా చెవులు రిక్కించి వినండి.. ప్రపంచంలో ఏ శక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది, అది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమ‌ని అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానించాలని చూసిందని, రెండు రాజ్యాంగాలు ఉండాలన్న.. కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టార‌ని చెప్పారు.


సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ హామీలు అమలుచేయలేదని వ్యాఖ్యానించారు. అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పరాన్నజీవిగా మారిందని, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, హర్యానాతో పాటు.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఖాతా ఖాళీ అయిందని అన్నారు. కాంగ్రెస్‌ విభజనవాద రాజకీయాలు విఫలమ‌య్యాయ‌ని చెప్పారు. రాజ్యాంగంలో వక్ఫ్‌ చట్టానికి స్థానమే లేదని, ఓట్ల కోసం కాంగ్రెస్‌ వక్ఫ్‌ చట్టం తెచ్చింద‌ని విమ‌ర్శించారు.

Related News

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

Big Stories

×