E-Paper
Advertisement

Pm Modi: ఏ శ‌క్తీ ఆర్టిక‌ల్ 370ని మ‌ళ్లీ తీసుకురాలేదు.. దేశంలో ఒకే రాజ్యాంగం.. మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pm Modi: ఏ శ‌క్తీ ఆర్టిక‌ల్ 370ని మ‌ళ్లీ తీసుకురాలేదు.. దేశంలో ఒకే రాజ్యాంగం.. మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pm Modi: మ‌హారాష్ట్ర విజ‌యంతో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వ‌హించారు. ఈ సంబురాల్లో ప్ర‌ధాని మోడీ, అమిత్ షాతో పాటూ న‌డ్డా రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ…మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని అన్నారు. కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని, అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని అభిప్రాయ‌ప‌డ్డారు. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Also read: జార్ఖండ్‌‌ను నిలుపుకున్న ఇండియా కూటమి.. 81కి 55 స్థానాల్లో విజయబావుటా

ఉత్త‌ర్ ప్ర‌దేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరిందని చెప్పారు. 50 ఏళ్ల త‌ర‌వాత ఇది అతిపెద్ద విజయం అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలారా చెవులు రిక్కించి వినండి.. ప్రపంచంలో ఏ శక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది, అది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమ‌ని అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానించాలని చూసిందని, రెండు రాజ్యాంగాలు ఉండాలన్న.. కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టార‌ని చెప్పారు.

సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ హామీలు అమలుచేయలేదని వ్యాఖ్యానించారు. అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పరాన్నజీవిగా మారిందని, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, హర్యానాతో పాటు.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఖాతా ఖాళీ అయిందని అన్నారు. కాంగ్రెస్‌ విభజనవాద రాజకీయాలు విఫలమ‌య్యాయ‌ని చెప్పారు. రాజ్యాంగంలో వక్ఫ్‌ చట్టానికి స్థానమే లేదని, ఓట్ల కోసం కాంగ్రెస్‌ వక్ఫ్‌ చట్టం తెచ్చింద‌ని విమ‌ర్శించారు.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×