BigTV English
Advertisement

Mamata Banerjee on Modi Guarantee: మోదీ గ్యారంటీ అంటే ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడమే: మమతా బెనర్జీ!

Mamata Banerjee on Modi Guarantee: మోదీ గ్యారంటీ అంటే ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడమే: మమతా బెనర్జీ!
Mamata Banerjee On Modi Guarantee
Mamata Banerjee On Modi Guarantee

Mamata Banerjee Comments on Modi Guarantee’s: జూన్ 4 తర్వాత అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టడం ఖాయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం అన్నారు.


ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.

బంకురా వద్ద జరిగిన ర్యాలీని ఉద్దేశించి టీఎంసీ చీఫ్ మాట్లాడుతూ, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే జాతీయ దర్యాప్తు సంస్థ పుర్బా మేదినీపూర్ జిల్లాలోని భూపతినగర్‌కు వెళ్లిందని ఆరోపించారు.


ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించేందుకు ప్రధాని పశ్చిమ బెంగాల్‌కు వస్తున్నారని, దానితో తనకు ఎలాంటి సమస్యలు లేవని, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటివరకు జరిగిన అవినీతిపై ప్రతిపక్ష నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్న తీరు ఆమోదయోగ్యం కాదని ఆమె అన్నారు.

Also Read: కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలంటూ పిటిషన్.. భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు

ఆదివారం జల్పాయ్‌గురిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. “నేను అవినీతి తొలగించండి అని చెబుతుంటే, ప్రతిపక్షాలు ‘అవినీతిపరులను రక్షించండి’ అంటున్నాయి. జూన్ 4 తర్వాత అవినీతిపరులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటాము,” అని అన్నారు.

ఓ ప్రధాని ఇలాగే మాట్లాడాలా.. ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను జైల్లో పెడతానని చెబితే ఎలా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదయోగ్యం కాదని ఆమె అన్నారు.

“ఇది వాస్తవానికి ‘మోదీ కి హామీ’ అంటే, జూన్ 4 తర్వాత ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టడం” అని మమతా బెనర్జీ ఆరోపించారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×