Sports Awards: 2025 జాతీయ క్రీడా పురస్కాలను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రిటైర్డ్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా అవార్డు గ్రహీతల ఎంపిక చేశారు. వివిధ విభాగాల కింద క్రీడాకారులు, కోచ్లు సంస్థలకు అవార్డులను ప్రదానం చేయనున్న కేంద్రం పేర్కోంది.
క్రీడలు, ఆటలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది. మోత్తం 17 మందికి అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.
Also Read: మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!
తేజస్విన్ శంకర్ (అథ్లెటిక్స్)
ముహమ్మద్ అజ్మల్ వి (అథ్లెటిక్స్)
ప్రియాంక గోస్వామి (అథ్లెటిక్స్)
ట్రీసా జాలీ (బ్యాడ్మింటన్)
పుల్లెల గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్)
నరేందర్ (బాక్సింగ్)
విదిత్ సంతోష్ గుజరాతీ (చదరంగం)
దివ్య జితేంద్ర దేశ్ముఖ్ (చదరంగం)
ధనుష్ శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్)
లాల్రెమ్సియామి (హాకీ)
రాజ్కుమార్ పాల్ (హాకీ)
సుర్జీత్ (కబడ్డీ)
పూజ (కబడ్డీ)
రుద్రాంశ్ ఖండేల్వాల్ (పారా-షూటింగ్)
ఏక్తా భ్యాన్ (పారా అథ్లెటిక్స్)
అరవింద్ సింగ్ (రోయింగ్)
అఖిల్ షియోరాన్(షూటింగ్)
ఐ అరుమైనాయగం అర్జున పురస్కారం (జీవితకాల పురస్కారం) (ఫుట్బాల్)
పర్వీర్ సింగ్(అథ్లెటిక్స్),ఛోటే లాల్ యాదవ్(బాక్సింగ్), నేహా నందకుమార్ చవాన్(షూటింగ్) ముగ్గురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనునున్నారు. ఇద్దరికీ ద్రోణాచార్య జీవితకాల పురస్కారాలు, ధర్మేంద్ర సింగ్ యాదవ్(బాక్సింగ్),వీరేందర్ కుమార్(కుస్తీ)కి ఇవ్వనున్నారు. ఆర్మీ పారాలింపిక్ నోడ్, పూణే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ప్రకటనచేయనున్నారు.
Also Read: 22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు