E-Paper
Advertisement

22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

22A List: 22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తామన్నారు. దీనిపై బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చుని మంత్రి స్పష్ట్రం చేశారు.

కావాలనే చేశారా..

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నామని, బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హమీ ఇచ్చారు. దీనికోసం ఎవరు దరఖాస్తులు చేసుకోవద్దని తెలిపారు. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. పొరపాటున జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేశారా అనేది విచారణ చేస్తామని మంత్రి తెలిపారు.

Advertisement

Also Read: కోర్టు చుట్టూ తిరుగుతున్న పల్లవి ప్రశాంత్.. రెండేళ్లయినా ఆగని తిప్పలు!

అధికారులపై చర్యలు..

యాదగిరిగుట్టలో 42 వేల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో పెట్టారని దీన్ని సీఎంకు నాలుగు నెలల క్రితమే చెప్పామని కోమటి రెడ్డి అన్నారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చు. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. 30 శాతం కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుందని ఫైర్ అయ్యారు.

22Aలో మధ్యతరగతి పేదలు..

Advertisement

సీఎం అమెరికా టూర్ తర్వాత దీనిపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. మా ప్రభుత్వం మంచితనాన్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండవచ్చు. తప్పు ఎవరిదో తేలితే వాళ్లను ఏం చేయాలో మాకు తెలుసని మంత్రి ఫైర్ అయ్యారు. 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోనని, ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేనివని అన్నారు.

Also Read: అక్రమాలపై చర్చించే దమ్ములేక సీఎం భయపడుతున్నారా.. బొత్స సత్యనారాయణ

Tags

Related News

సర్ పై నిప్పులు చెరిగిన పీసీసీ మహేష్ కుమార్ గౌడ్.. ప్రశ్నార్థకంగా 92 లక్షల ఓట్లు!

ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు

భూలక్ష్మి పేరుతో కవిత బిగ్ అనౌన్స్‌మెంట్.. వారికి ఎకరం భూమి ఉచితం!

దసరాలోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

సిరిసిల్లలో ఘోర అగ్నిప్రమాదం.. మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ దగ్ధం.. యూపీ కూలీ సజీవ దహనం!

బాన్సువాడలో బిగ్ ట్విస్ట్.. KCR వద్ద పోచారం పశ్చాత్తాపం.. BRS లైన్ క్లియర్ చేసిందా?

హైడ్రాకు మద్దతుగా వృత్తి నిపుణులు.. కమీషనర్‌ ఏవీ రంగనాథ్‌తో భేటీ!

Big Stories

Advertisement
×