E-Paper
Advertisement

Update on Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడిని పట్టించిన క్యాప్..!

Update on Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడిని పట్టించిన క్యాప్..!

Rameshwaram Cafe Blast Suspects Arrest: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి మతీన్ తాహాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అర్సెట్ చేసింది. రామేశ్వరంలో బ్లాస్ట్ జరిగినప్పటి నుంచీ పరారీలో ఉన్న ఇద్దరూ అస్సాం, పశ్చిమబెంగాల్ లో దాక్కున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. నిందితులను ఒక క్యాప్ పట్టించింది.

Also Read : యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. వెంటనే అప్లై చేసేయండి.. పరీక్ష ఎప్పుడంటే?

నిందితులు క్యాప్ కొనేందుకు ఒక షాప్ కు వెళ్లగా.. అక్కడి సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా వారిని గుర్తించారు. తరచూ సిమ్ కార్డులను మార్చుతూ.. పోలీసులకు దొరక్కుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లేందుకు ప్రయత్నించినా.. రాడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ గా భావిస్తున్న నిందితుడు.. గతంలో శివనసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి ఫారెస్ట్ విభాగంలో కొందరికి ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ తెలిపింది.

కాగా.. ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరులో జరిగిన బాంబు పేలుడులో 9 మంది గాయపడ్డారు. నిందితుడు ఇడ్లీ తిని.. తన చేతిలోని బాంబు బ్యాగ్ ను అక్కడే వదిలి వెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. ఆ సమయంలో నిందితుడు టోపీ ధరించి ఉన్నాడు. ఆ టోపీ ఆధారంగా దర్యాప్తు చేసిన బృందాలు.. అతను కొనుగోలు చేసినప్పటి దృశ్యాలను కనుగొన్నారు. వాటి ఆధారంగానే నిందితులను అరెస్ట్ చేశారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×