E-Paper
Advertisement

588 మంది వాంగ్మూలం.. 7,500 పేజీల చార్జి షీట్.. ఎర్రకోట బ్లాస్టింగ్ కేసులో సంచలనాలు..!

588 మంది వాంగ్మూలం.. 7,500 పేజీల చార్జి షీట్.. ఎర్రకోట బ్లాస్టింగ్ కేసులో సంచలనాలు..!
Advertisement

Red Fort Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎర్ర కోట పేలుడు కేసులో ఎన్​ఐఏ అధికారులు మొదటి ఛార్జ్​ షీట్​ ను కోర్టుకు సమర్పించారు. 7,500 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జ్​ షీట్ లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్​ ఖైదాకు అనుబంధ సంస్థగా ఉన్న అన్నార్​ గజ్వా ఉల్​ హింద్​ తో నిందితులకు సంబంధాలు ఉన్నట్టుగా తెలియచేశారు. ఈ వైట్​ కోట్​మాడ్యూల్ లో ఉన్నవాళ్లంతా వైద్యులే అని పేర్కొన్నారు. కీలక రక్షణ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు కుట్రలు జరిపారని తెలియచేశారు. ఆపరేషన్​ హెవెన్లీ హింద్​ అని పేరు పెట్టుకున్నట్టు వివరించారు.

అసలేం జరిగిందంటే?

గతేడాది నవంబర్​ 10న దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్ర కోట వద్ద కారు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. దీంట్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కుట్ర చేసిన ఉమర్​ బిన్​ నబీ కారులో కూర్చొని తనను తాను పేల్చుకోవటం ద్వారా ఈ మారాణ హోమానికి పాల్పడ్డాడు. దీనిపై దర్యాప్తు జరిపిన ఎన్​ఐఏ అధికారులు ఆత్మాహుతి దాడి చేసిన ఉమర్​ బిన్ నబీతోపాటు మొత్తం 11మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్​ అహమద్ మొహియుద్దీన్​ సయ్యద్ కూడా ఉన్నాడు.

588 మంది వాంగ్మూలాలు

Advertisement

దర్యాప్తులో భాగంగా ఎన్​ఐఏ అధికారులు హరియాణా, జమ్మూ కాశ్మీర్​, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో 588మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. 395కు పైగా డాక్యుమెంట్లు, 200కు పైగా సీజ్​ చేసిన పరికరాల నుంచి సాక్ష్యాలను సేకరించారు. విచారణలో ఈ వైట్​ కోట్ గ్రూప్​ లోని డాక్టర్లకు ఉగ్రవాద సంస్థ అల్​ ఖైదా ఇన్​ ఇండియన్​ సబ్ కాంటినెంట్​ కు అనుబంధ సంస్థగా ఉన్న అన్నార్​ గజ్వా ఉల్​ హింద్ తో సంబంధాలు ఉన్నాయని ఛార్జ్​ షీట్​ లో పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర

నిందితులు అందరూ 2022లో శ్రీనగర్​ లో సమావేశమై గ్రూప్​ ను ఏర్పాటు చేసుకున్నట్టు చార్జీషీట్ లో ఎన్ఐఏ పేర్కొంది. భారత్​ లో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేసినట్టుగా కోర్టుకు తెలియజేసింది. కుట్రను అమలు చేయటానికి ఈ గ్రూప్​ నియామకాలు కూడా జరిపిందని అధికారులు తెలిపారు. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను సేకరించి ఐఈడీ బాంబులను తయారు చేశారని తెలియజేశారు. తమ నివాస స్థలాలు, ల్యాబ్​ లనే వీటి తయారీ హబ్ లుగా మార్చుకున్నారని వివరించారు.

Advertisement

Also Read: ప్రపంచానికి ‘చమురు సెగ’.. మళ్లీ లాక్‌డౌన్ చీకట్లోకి దేశాలు.. మరి భారత్ సంగతేంటి?

రాకెట్​లు, డ్రోన్లతో దాడికి ప్లాన్

మదర్ ఆఫ్​ సైతాన్​ గా పిలిచే అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం ట్రైఆసిటోన్​ ట్రైపెరాక్సైడ్ ను కూడా నిందితులు ల్యాబ్ లో తయారు చేసినట్టు ఎన్ఐఏ చార్జ్ షీట్ లో తెలిపింది. జమ్మూ కాశ్మీర్​ తోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కీలక భద్రతా స్థావరాలు, రక్షణ సంస్థలను టార్గెట్​ గా పెట్టుకున్నారని పేర్కొంది. రాకెట్​లు, డ్రోన్లకు ఐఈడీ బాంబులను అమర్చి దాడులు చేయాలని కుట్రలు చేసినట్టుగా వివరించారు. దీని కోసం ట్రయల్స్ కూడా జరిపారన్నారు.

Also Read: ‘ముందు బాధితురాలి వయసు తేల్చండి’.. బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనం

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×