E-Paper
Advertisement

Maldives Water Crisis: మాల్దీవుల్లో తాగునీటి కొరత.. చైనా సాయం

Maldives Water Crisis: మాల్దీవుల్లో తాగునీటి కొరత.. చైనా సాయం
Advertisement
China
Now China Sends 1,500 Tonnes of Drinking Water From Tibet To Maldives:  ఇండియా- మాల్దీవుల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మాల్దీవులు ఆర్థికంగా తీవ్రంగా నష్టాన్ని చవిచూడక తప్పలేదు. తాజాగా మాల్దీవ్ ప్రజలకు తాగునీరు కష్టాలు వచ్చి పడ్డాయి. తాగునీటి కోసం అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సందర్భంగా తాగునీటి కొరతను తీర్చేందుకు చైనా ముందుకొచ్చింది.
ఇండియాతో ద్వైపాక్షిక వివాదం తర్వాత మాల్దీవులకు అన్ని విధాల సహాయం చేస్తామని చైనా ఇప్పటికే ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే చైనా 1500 టన్నుల తాగునీటిని మాల్దీవులకు పంపింది. టిబెట్‌లోని హిమానీనదాల నుండి చైనా వీటిని సేకరించింది. చైనా ఇప్పటికే మాల్దీవులతో ఒప్పందం కుదుర్చుకుంది. చైనా టిబెట్ అటానమస్ రీజియన్ ప్రెసిడెంట్ యాన్ జిన్‌హై మాల్దీవులల్లో గతేడాది నవంబర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ ముయిజ్జును కలిశారని, తాగునీటి కొరతను అధిగమించేందుకు సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా మాల్దీవులకు చైనా బాష్ప వాయుగోళాలు, పెప్పర్ స్ప్రే వంటి సాధారణ అస్త్రాలను ఉచితంగా అందించడంతో పాటు సైనిక శిక్షణ అందిస్తుందని డాక్టర్ మహ్మద్ మయిజ్జు తెలిపారు.

నవంబర్ 2023 మహ్మద్ మయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాల్దీవులు చైనా వైపు మొగ్గు చూపుతోంది. దీంతో ఇరు దేశాలు పరస్పర సహకార మంత్రం జపిస్తున్నాయి. ఇక తాజాగా తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా పంపిన నీటితో తమ దేశంలో మంచి నీటి కొరతను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. మాల్దీవులకు తాగునీటి కష్టాలు రావడం ఇదేం తొలిసారి కాదు.

Advertisement

గతంలో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న సమయంలో పొరుగున దేశాలు తాగునీటిని అందించాయి. 2014 డిసెంబరులో తీవ్రమైన నీటి కొరత ఏర్పడినప్పుడు, భారతదేశం వెంటనే విమానాల ద్వారా మాల్దీవులకు 375 టన్నుల నీటిని రవాణా చేసింది. ఆ తర్వాత కూడా ఐఎన్ఎస్ సుకన్య, ఐఎన్ఎస్ దీపక్ నౌకల ద్వారా 2000 టన్నుల నీటి సరఫరా చేసింది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×