BigTV English
Advertisement

Oleander Flowers Ban: ఆలయాల్లో ఎర్రగన్నేరు పూలపై నిషేధం.. ఎందుకంటే..?

Oleander Flowers Ban: ఆలయాల్లో ఎర్రగన్నేరు పూలపై నిషేధం.. ఎందుకంటే..?

Oleander Flowers Banned in Kerala Temples: ఎర్ర గన్నేరు పువ్వులు, అరళీ పువ్వులుగా పిలుచుకునే ఒలియాండర్ పువ్వులను ఆలయాల్లో ఉపయోగించడంపై కేరళలో రెండు దేవస్థాన బోర్డులు నిషేధం విధించాయి. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు, మలబార్ దేవస్వోమ్ బోర్డుల పరిధులలో ఉన్న అన్ని ఆలయాల్లో పవిత్ర ఆచారాలలో ఈ పువ్వులను వినియోగించడంపై నిషేధం విధించాయి. ఒలియాండర్ పువ్వులు మానవులు, జంతువులకు కూడా హాని కలిగించే లక్షణాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వోమ్ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.


ఎర్రగన్నేరు పువ్వులకు బదులుగా తులసి, మల్లె, చామంతి, తేచి, గులాబీ వంటి పువ్వులను వినియోగిస్తామని వెల్లడించారు. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు పరిధిలోని 1248 దేవాలయాలు, మలబార్ దేవస్వోమ్ బోర్డు పరిధిలోని 1400 దేవాలయాల్లో ఈ పువ్వులను వాడటం లేదని పేర్కొన్నారు.

Also Read: పారిజాత పువ్వులతో పూజ చేయకూడదా..? వాస్తవమేంటి?


ఇటీవల అలప్పుజాలో ఈ పువ్వులను తినడంతో సూర్యా నరేంద్రన్ (24) అనే యువతి మృతి చెందింది. నర్సింగ్ చేసిన ఆ యువతి.. ఉద్యోగంలో చేరేందుకు యూకే కు పయనమైంది. నెడుంబస్సేరి ఎయిర్ పోర్టుకు చేరుకోగానే కుప్పకూలింది. అందుకే వీటిని నైవేద్యాలలో ఉపయోగించడంపై నిషేధం విధించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ పువ్వులలో కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఉంటాయని, ఇవి గుండెకు హాని చేస్తాయని వైద్యులు తెలిపారు.

Tags

Related News

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Big Stories

×