BigTV English

Oleander Flowers Ban: ఆలయాల్లో ఎర్రగన్నేరు పూలపై నిషేధం.. ఎందుకంటే..?

Oleander Flowers Ban: ఆలయాల్లో ఎర్రగన్నేరు పూలపై నిషేధం.. ఎందుకంటే..?

Oleander Flowers Banned in Kerala Temples: ఎర్ర గన్నేరు పువ్వులు, అరళీ పువ్వులుగా పిలుచుకునే ఒలియాండర్ పువ్వులను ఆలయాల్లో ఉపయోగించడంపై కేరళలో రెండు దేవస్థాన బోర్డులు నిషేధం విధించాయి. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు, మలబార్ దేవస్వోమ్ బోర్డుల పరిధులలో ఉన్న అన్ని ఆలయాల్లో పవిత్ర ఆచారాలలో ఈ పువ్వులను వినియోగించడంపై నిషేధం విధించాయి. ఒలియాండర్ పువ్వులు మానవులు, జంతువులకు కూడా హాని కలిగించే లక్షణాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వోమ్ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.


ఎర్రగన్నేరు పువ్వులకు బదులుగా తులసి, మల్లె, చామంతి, తేచి, గులాబీ వంటి పువ్వులను వినియోగిస్తామని వెల్లడించారు. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు పరిధిలోని 1248 దేవాలయాలు, మలబార్ దేవస్వోమ్ బోర్డు పరిధిలోని 1400 దేవాలయాల్లో ఈ పువ్వులను వాడటం లేదని పేర్కొన్నారు.

Also Read: పారిజాత పువ్వులతో పూజ చేయకూడదా..? వాస్తవమేంటి?


ఇటీవల అలప్పుజాలో ఈ పువ్వులను తినడంతో సూర్యా నరేంద్రన్ (24) అనే యువతి మృతి చెందింది. నర్సింగ్ చేసిన ఆ యువతి.. ఉద్యోగంలో చేరేందుకు యూకే కు పయనమైంది. నెడుంబస్సేరి ఎయిర్ పోర్టుకు చేరుకోగానే కుప్పకూలింది. అందుకే వీటిని నైవేద్యాలలో ఉపయోగించడంపై నిషేధం విధించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ పువ్వులలో కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఉంటాయని, ఇవి గుండెకు హాని చేస్తాయని వైద్యులు తెలిపారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×