E-Paper
Advertisement

Pakistan Pilot: పాకిస్తాన్ కు బిగ్ షాక్.. పట్టుబడ్డ పైలట్..

Pakistan Pilot: పాకిస్తాన్ కు బిగ్ షాక్.. పట్టుబడ్డ పైలట్..
Advertisement

Pakistan Pilot: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ప్రాంతంలో భారత వైమానిక దళం పాకిస్తాన్ పైలట్‌ను సజీవంగా పట్టుకుంది. ఈ ఘటన మరింత ఆసక్తిని రేపుతోంది, ఎందుకంటే అదే సమయంలో కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ నుండి డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి.

ఢీకొన్న పాకిస్తాన్ విమానాలు..
జైసల్మేర్, అఖ్నూర్ ప్రాంతాల్లో రెండు పాకిస్తాన్ విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే, భారత వైమానిక దళం సమర్థవంతంగా స్పందించి, పాకిస్తాన్ పైలట్‌ను పట్టుకోగలిగింది. భారత వైమానిక దళం ఈ ఘటనకు తక్షణమే స్పందించి, ప్రమాదాన్ని కంట్రోల్ చేస్తూ, పాకిస్తాన్ పైలట్‌ను సజీవంగా పట్టుకోవడం విశేషం.

Advertisement

డ్రోన్ దాడులు
ఇదే సమయంలో, కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ వాయుసేన డ్రోన్ దాడులు నిర్వహించగా ఆర్మీ, వాయుసేనలు విజయవంతంగా తిప్పికొట్టాయి. డ్రోన్ లను గమనించి మన భద్రతా దళాలు తక్షణమే స్పందించాయి. డ్రోన్‌ల ద్వారా భారత సరిహద్దుల్లో చొరబడే ప్రయత్నాలకు పాకిస్తాన్ పూనుకోవడంతో మన దేశం అంతే స్థాయిలో పాకిస్తాన్ లోని పంజాబ్ పై విరుచుకుపడుతోంది.

భారత భద్రతా దళాలు, ఈ డ్రోన్ దాడులను నిరోధించేందుకు, గగనతల పరిణామాలను అంచనా వేసి, అత్యుత్తమ వ్యూహాలతో సమాధానం ఇచ్చాయి. కాశ్మీర్, ఇతర సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ నుంచి ఈ తరహా దాడులు పెరిగే అవకాశం ఉందని, భారత భద్రతా దళాలు తక్షణ చర్యలు తీసుకుంటూ, సమర్థవంతంగా పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Also Read: PBKS vs DC War Effect: పాకిస్థాన్ దాడులు….పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు

భారత్-పాకిస్తాన్ భద్రతా చర్చలు
ఈ ఘటనల అనంతరం, భారతదేశం, పాకిస్తాన్ మధ్య భద్రతా చర్చలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి గగనతల దాడులు, డ్రోన్ దాడులు, సరిహద్దు భద్రతపై అనేక చర్చలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ పైలట్ ను మన భద్రతా దళాలు పట్టుకోవడం ఇప్పుడు పాకిస్తాన్ కు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే హుటాహుటిన ప్రధాని మోడీజీ, అత్యవసరంగా అజిత్ దోవల్ తో సమావేశం కావడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే పాకిస్తాన్ తన వంకర బుద్ధి పోగొట్టుకోకుండా ఇంకా దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండియన్ నేవీ సైతం అప్రమత్తమైంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×