E-Paper
Advertisement

Mamata Banerjee: రామ నవమి రోజు అల్లర్లు సృష్టించే కుట్ర జరుగుతోంది.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

Mamata Banerjee: రామ నవమి రోజు అల్లర్లు సృష్టించే కుట్ర జరుగుతోంది.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

Mamata Banerjee: శ్రీరామ నవమి రోజు అల్లర్లు సృష్టించేందుకు ప్రణాలికలు రచిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది బెంగాల్‌లో రామనవమి వేడుకలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలు బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణకు దారితీశాయి.

“వారు ఈ రోజు అల్లర్లను ప్రేరేపిస్తారు. అల్లర్లు జరిగే అవకాశం ఉంది.ఇలా అల్లర్లు సృష్టించి ఓట్లను కొల్లగొట్టడం ద్వారా గెలుస్తారు” అని బెనర్జీ ఎన్నికల ర్యాలీలో ఆరోపించారు. ఈరోజు తెల్లవారుజామున, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, రాష్ట్ర ప్రజలకు అభివాదం చేస్తూ, రామ నవమి వేడుకల సందర్భంగా “శాంతిని కాపాడండి” అని విజ్ఞప్తి చేశారు.

Mamata Banerjee
Mamata Banerjee

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భారతీయ సంస్కృతిని, సనాతన సంస్కృతిని కించపరుస్తున్నారని బీజేపీ ఖండించింది.

“పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు. ఇది రామనవమి పండుగను కించపరచడం, ఇతర మతపరమైన సందర్భాలలో మీరు (మమతా బెనర్జీ) శాంతి సందేశం ఇచ్చారు, కానీ ఇక్కడ మీరు అడుగుతున్నారు… శాంతిని కాపాడండి అని శాంతి, శ్రేయస్సు సందేశాన్ని ఇవ్వడానికి బదులుగా, మీరు ఇలా చేయడం ద్వారా భారతీయ, సనాతన సంస్కృతిని కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు” అని బీజేపీ రాజ్యసభ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు.

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ అంతటా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ రెండూ రామనవమి ఊరేగింపులను నిర్వహించాయి. నగరంలోని న్యూ టౌన్ ప్రాంతంలో జరిగిన అటువంటి రామనవమి ఊరేగింపులో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పాల్గొన్నారు. TMC మంత్రి అరూప్ రాయ్, పార్టీ హౌరా లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి ప్రసూన్ బెనర్జీ హౌరా పట్టణంలో ఊరేగింపులతో నడిచారు.

Also Read: మోదీ గ్యారంటీ అంటే ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడమే: మమతా బెనర్జీ!

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వందలాది మంది యువకులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తూ, కాషాయ జెండాలు పట్టుకుని, డప్పు వాయిద్యాల నడుమ రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రదర్శనలు నిర్వహించారు.

పోలీసులు, భద్రతా బలగాలు నిఘా ఉంచడంతో పరిస్థితి ఇంతవరకు ప్రశాంతంగానే ఉంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×