E-Paper
Advertisement

Mamata Banerjee: రామ నవమి రోజు అల్లర్లు సృష్టించే కుట్ర జరుగుతోంది.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

Mamata Banerjee: రామ నవమి రోజు అల్లర్లు సృష్టించే కుట్ర జరుగుతోంది.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
Advertisement

Mamata Banerjee: శ్రీరామ నవమి రోజు అల్లర్లు సృష్టించేందుకు ప్రణాలికలు రచిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది బెంగాల్‌లో రామనవమి వేడుకలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలు బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణకు దారితీశాయి.

“వారు ఈ రోజు అల్లర్లను ప్రేరేపిస్తారు. అల్లర్లు జరిగే అవకాశం ఉంది.ఇలా అల్లర్లు సృష్టించి ఓట్లను కొల్లగొట్టడం ద్వారా గెలుస్తారు” అని బెనర్జీ ఎన్నికల ర్యాలీలో ఆరోపించారు. ఈరోజు తెల్లవారుజామున, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, రాష్ట్ర ప్రజలకు అభివాదం చేస్తూ, రామ నవమి వేడుకల సందర్భంగా “శాంతిని కాపాడండి” అని విజ్ఞప్తి చేశారు.

Mamata Banerjee
Mamata Banerjee
Advertisement

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భారతీయ సంస్కృతిని, సనాతన సంస్కృతిని కించపరుస్తున్నారని బీజేపీ ఖండించింది.

“పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు. ఇది రామనవమి పండుగను కించపరచడం, ఇతర మతపరమైన సందర్భాలలో మీరు (మమతా బెనర్జీ) శాంతి సందేశం ఇచ్చారు, కానీ ఇక్కడ మీరు అడుగుతున్నారు… శాంతిని కాపాడండి అని శాంతి, శ్రేయస్సు సందేశాన్ని ఇవ్వడానికి బదులుగా, మీరు ఇలా చేయడం ద్వారా భారతీయ, సనాతన సంస్కృతిని కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు” అని బీజేపీ రాజ్యసభ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు.

Advertisement

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ అంతటా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ రెండూ రామనవమి ఊరేగింపులను నిర్వహించాయి. నగరంలోని న్యూ టౌన్ ప్రాంతంలో జరిగిన అటువంటి రామనవమి ఊరేగింపులో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పాల్గొన్నారు. TMC మంత్రి అరూప్ రాయ్, పార్టీ హౌరా లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి ప్రసూన్ బెనర్జీ హౌరా పట్టణంలో ఊరేగింపులతో నడిచారు.

Also Read: మోదీ గ్యారంటీ అంటే ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడమే: మమతా బెనర్జీ!

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వందలాది మంది యువకులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తూ, కాషాయ జెండాలు పట్టుకుని, డప్పు వాయిద్యాల నడుమ రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రదర్శనలు నిర్వహించారు.

పోలీసులు, భద్రతా బలగాలు నిఘా ఉంచడంతో పరిస్థితి ఇంతవరకు ప్రశాంతంగానే ఉంది.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×